పవన్ క‌ళ్యాణ్ సరసన ఛాన్స్ కొట్టేసిన వరుణ్ తేజ్ హీరోయిన్‌

-

రాజకీయాలతో సినిమాలకు దూరమైన పవర్‌ స్టార్ పవన్‌ కళ్యాణ్ మ‌ళ్లీ సిల్వ‌ర్ స్క్రీన్‌పై రీ ఎంట్రీ ఇస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ క్రమంలోనే శ్రీరామ్ వేణు దర్శకత్వంలో హిందీలో అమితాబ్ బచ్చన్ హీరోగా నటించిన ‘పింక్’ సినిమా రీమేక్ ‘లాయర్ సాబ్’ సినిమా చేస్తున్నాడు. ‘దిల్’ రాజు నిర్మాణంలో వేణు శ్రీరామ్ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతోంది. ఈ చిత్రం ఇప్ప‌టికే సెట్స్‌పైకి వెళ్లింది. అయితే ఈ సినిమాతోపాటు క్రిష్‌ దర్శకత్వంలో మరో సినిమాలో నటించేందుకు ఓకే చెప్పినట్టుగా ప్రచారం జరుగుతోంది. క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కబోయే ఈ చిత్రాన్ని ఏఎం రత్నం నిర్మించబోతున్నాడు. పవన్ కల్యాణ్ 27వ సినిమా ఇది.

ఈ సినిమాలో పవన్ దొంగగా నటించబోతున్నాడని.. ఇది టైగర్ నాగేశ్వరరావు బయోపిక్ అని కొన్ని రోజులుగా ఇండస్ట్రీలో ప్రచారం అయితే జోరుగానే జరుగుతుంది. అయితే ఈ చిత్రంలో పవన్ సరసన కథానాయికగా ప్రగ్యా జైస్వాల్ ను ఎంపిక చేసినట్టుగా తెలుస్తోంది. గతంలో వ‌రుణ్ తేజ్‌ ‘కంచె’ సినిమాతో ఆమె మంచి మార్కులు కొట్టేసిన సంగతి తెలిసిందే. తెలుగులో ఆమె చివరిగా చేసిన చిత్రం `ఆచారి అమెరికా యాత్ర`. ప్ర‌స్తుతం ఈమె అంతగా ఫామ్‌లో లేద‌నే చెప్పాలి. అయిన‌ప్ప‌టీకి ప‌వ‌న్ ప్రగ్యా జైస్వాల్‌కు ఛాన్స్ ఇవ్వ‌డం టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version