ఈరోజు రాత్రి దిల్ రాజు రెండవ వివాహం ..!

-

టాలీవుడ్‌ లో అగ్ర నిర్మాతగా నిర్మాత ‘దిల్ రాజు’. డిస్ట్రిబ్యూటర్ గా మొదలైన సినీ కెరీర్ ఆ తర్వాత నిర్మాతగా మారి అద్భుతమైన విజయాలను అందుకున్నారు. అతి తక్కువ కాలంలోనే ఇండస్ట్రీలో స్టార్ ప్రొడ్యూసర్ గా పాపులర్ అయ్యారు. అయితే మూడేళ్ళ క్రితం దిల్ రాజు భార్య అనిత అనారోగ్యం కారణంగా మరణించిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి దిల్ రాజు ఒంటరిగానే ఉంటున్నారు.

 

దీంతో మరో పెళ్లి చేసుకోమని కుటుంబ సంభ్యులు, సన్నిహితులు ఎప్పటినుండో కోరుతున్నప్పటికి ఈ విషయంలో దిల్ రాజు ఆసక్తి చూపించలేదు. ఆ మద్యన ఇదే విషయమై సోషల్ మీడియాలో వార్తలు వెల్లువెత్తాయి. ఇక ప్రస్తుతం కుటుంబ సంభ్యులు, సన్నిహితులు కోరిక మేరకు రెండో వివాహానికి అంగీకరించారు దిల్ రాజు. ఈ రోజు రాత్రి వివాహం చేసుకోబోతున్నారట. తన స్వస్థలమైన నిజామాబాద్‌ లోని వెంక‌టేశ్వ‌ర స్వామి గుడిలో దిల్ రాజు వివాహం జరగనుందని తాజా సమాచారం. ప్రభుత్వ సూచనల మేరకు ఈ వివాహానికి కేవలం 10 మంది కుటుంబ సభ్యులు మాత్రమే హాజరవ్వనున్నారు. తన పెళ్లి పై దిల్ రాజు స్పందిస్తూ స్వయంగా సోషల్ మీడియాలో ఓ సందేశం పోస్ట్ చేశారు.

‘ప్రస్తుతం ఈ ప్రపంచం ఎదురుకుంటున్న పరిస్థితులను ఎవ్వరూ జీర్ణించుకోలేపోతున్నాము. ఇలాంటి కష్ట సమయంలో వృత్తిపరంగా ఎదురయ్యే ఇబ్బందుల నుండి త్వరగా కోలుకోలేము. ఇక వ్యక్తిగతంగానూ నాకు గత కొన్ని రోజుల నుంచి మంచి టైమ్ రాలేదు. అంతా త్వరలోనే సర్దుకుంటుందని, అందరికీ మంచి రోజులు వస్తాయని ఆశిస్తున్నాను. అదే ఆశతో నా కొత్త జీవితాన్ని ప్రారంభించబోతున్నాను. అందుకు ఇదే అదునైన సమయంగా భావిస్తున్నాను” అని దిల్ రాజు పోస్ట్ చేసారు.

Read more RELATED
Recommended to you

Latest news