గుంటూరు కారం నుంచి పూజా హెగ్డే ఔట్.. అసలు కారణం చెప్పిన ప్రొడ్యూసర్ నాగవంశీ

-

టాలీవుడ్ బుట్టబొమ్మ పూజా హెగ్డే గత కొంతకాలంగా తెలుగు చిత్రపరిశ్రమలో కనిపించడం లేదు. వరుస ఫ్లాప్​లతో ఈ బ్యూటీ నెమ్మదిగా ఫేడ్ అవుట్ అయిపోతోంది. అయితే మహేశ్‌ బాబు హీరోగా దర్శకుడు త్రివిక్రమ్‌ తెరకెక్కిస్తున్న చిత్రం ‘గుంటూరు కారం’ నుంచి పూజా హెగ్డే ఔట్ అయిన విషయం తెలిసిందే. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈ సినిమా నిర్మాత నాగవంశీఈ సినిమాలో పూజా హెగ్డే ఎందుకు నటించడంలేదో క్లారిటీ ఇచ్చారు.

ముందుగా ఈ చిత్రాన్ని ఆగస్టులో విడుదల చేద్దామనుకుని తర్వాత 2024 జనవరి 12కు మార్చామని.. దాంతో, కంగారులేకుండా నెమ్మదిగా షూటింగ్‌ చేయాలనుకున్నామని నాగవంశీ చెప్పారు. కానీ, అదే సమయంలో పూజా హెగ్డే మరో హిందీ చిత్రంలో నటించాల్సి రావడం.. డేట్స్‌ సర్దుబాటుకాకపోవడంతో ఆమెను రీప్లేస్‌ చేశామని అసలు విషయం చెప్పారు. అయితే దానికే కొందరు హంగామా ఎందుకు చేశారో తనకు అర్థంకాలేదని.. పండగకు రావాల్సిన సినిమాలో ఏయే అంశాలు ఉండాలో అవన్నీ ఇందులో ఉన్నాయని స్పష్టం చేశారు. సంక్రాంతికి పక్కా ఈ సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తామని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news