నిందితుడుగా రాజ్ తరుణ్.. ముందస్తు బెయిల్..!

-

టాలీవుడ్  హీరో రాజ్ తరుణ్, లావణ్య కేసులో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. తనకు రాజ్ తరుణ్ కావాలని లావణ్య చెబుతోంది. మరోవైపు పోలీసులు ఈ కేసులో రాజ్ తరుణ్‌ నిందితుడేనని చెబుతున్నారు. రాజ్ తరుణ్, లావణ్య దాదాపు పదేళ్ల పాటు సహ జీవనం చేశారని పోలీసులు పేర్కొంటున్నారు. రాజ్‌తరుణ్-లావణ్య కేసులో పోలీసులు ఛార్జ్‌షీట్ దాఖలు చేశారు. ఛార్జ్‌షీట్‌లో రాజ్‌తరుణ్‌ను పోలీసులు నిందితుడిగా చేర్చారు. లావణ్యతో రాజ్‌తరుణ్‌ పదేళ్లు సహజీవనం చేసినట్లు పేర్కొన్నారు. పదేళ్లపాటు రాజ్‌తరుణ్-లావణ్య ఒకే ఇంట్లో ఉన్నారని చార్జిషీట్‌లో తెలిపారు. లావణ్య చెబుతున్న దాంట్లో వాస్తవాలు ఉన్నాయని పోలీసులు తెలిపారు.

లావణ్య ఇచ్చిన ఆధారాలతో పోలీసులు విచారణ చేపట్టారు. ఇప్పటికే ఈ కేసులో ముందస్తు బెయిల్ తీసుకున్నారు రాజ్ తరుణ్. తనకు చాలా హ్యాపీగా ఉంది. మాకు పెళ్లి జరిగింది. తాళి కట్టాడు. రాజ్ తరుణ్ తన భర్త అని.. పదేళ్ల నుంచి ఒకే దగ్గర ఉంటున్నామని.. పెళ్లి గురించి కూడా కోర్టులో ప్రూవ్ చేసుకుంటామని మీడియాతో చెప్పింది లావణ్య. కొన్నాళ్ల కిందటే పెళ్లి చేసుకొని కాపురం చేశామని వెల్లడించింది. పోలీస్ చార్జీ షీట్ పై సంతోషం వ్యక్తం చేస్తున్నానని తెలిపింది.

Read more RELATED
Recommended to you

Latest news