రాజమౌళి రామ్ చరణ్ కి ఈ కండీషన్ పెట్టాడా…?

-

రామ్ చరణ్ కి సోషల్ మీడియా విలువ తెలిసిందా…? అంటే అవుననే అంటున్నాయి సోషల్ మీడియా వర్గాలు. రామ్ చరణ్ ముందు నుంచి సోషల్ మీడియాలో ఎక్కువ యాక్టివ్ గా ఉండే వాడు కాదు. అయితే ఇప్పుడు మాత్రం అతను సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటున్నాడు. తన సోషల్ మీడియా ఖాతాలో ఎక్కువగా ఫోటోలు పోస్ట్ చేస్తూ హడావుడి చేస్తున్నాడు.

గత ఏడాది జులై లో అతను సోషల్ మీడియా ఫ్లాట్ ఫాం ఇన్‌స్టాగ్రామ్‌లో అడుగు పెట్టాడు. అక్కడి నుంచి కూడా చాలా యాక్టివ్ గా ఉంటున్నాడు రామ్ చరణ్. ప్రస్తుతం అతన్ని సోషల్ మీడియాలో 20 లక్షల మంది ఫాలో అవుతున్నారు. దీనితో వాళ్ళకు కూడా ఎప్పటికప్పుడు వినోదం పంచుతున్నాడు రామ్ చరణ్. అయితే అతను సోషల్ మీడియాకు అడుగు పెట్టడానికి ప్రధాన కారణం రాజమౌళి అంటున్నారు.

ప్రస్తుతం అతను రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో ఎన్టీఆర్‌తో క‌లిసి రామ్‌చ‌ర‌ణ్ న‌టిస్తోన్న చిత్రం ‘రౌద్రం రణం రుధిరం’(ఆర్ఆర్ఆర్). ఈ సినిమా కోసమే అతను సోషల్ మీడియాకు వచ్చినట్టు తెలుస్తుంది. ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాల కోసం సోషల్ మీడియాను ఎక్కువగా వాడుకోవాలని, దాని ద్వారా ఖర్చు తగ్గే అవకాశం ఉందని రాజమౌళి చెప్పడం తోనే ఈ నిర్ణయం తీసుకుని సోషల్ మీడియాలో యాక్టివ్ అయ్యాడని ఫాలోయింగ్ పెంచుకునే ప్రయత్నం చేస్తున్నాడని అంటున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news