త‌లైవా కోసం క‌ళానిధిమార‌న్ డేరింగ్ స్టెప్‌!

-

త‌లైవా త‌మిళ సూప‌ర్‌స్టార్ ర‌జ‌నీకాంత్ కోసం స్టార్ ప్రొడ్యూస‌ర్‌, మీడియా అధినేత క‌ళానిధి మార‌న్ డేరింగ్ స్టెప్ తీసుకున్నారు. ర‌జ‌నీతో ఇప్ప‌టి వ‌ర‌కు రోబో, పేట్ట చిత్రాల్ని నిర్మించిన ఆయ‌న స‌న్ పిక్చ‌ర్స్ బ్యాన‌ర్‌పై ముచ్చ‌ట‌గా మూడ‌వ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. `సిరుతై` శివ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ చిత్రాన్ని `అన్నాతే` పేరుతో రూపొందిస్తున్నారు. న‌య‌న‌తార‌, కీర్తి సురేష్‌, మీనా, ఖుష్బూ ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు.

గ‌త ఏడు నెల‌లుగా ఈ మూవీ షూటింగ్ ఆగిపోయింది. త్వ‌ర‌లో అంటే ఈ నెల 23న ఈ చిత్ర రెగ్యుల‌ర్ షూట్‌ని మొద‌లుపెట్టాల‌ని ప్లాన్ చేశారు. కానీ కొన్ని అనివార్య కార‌ణాల వ‌ల్ల కుద‌ర‌లేదు. న‌వంబ‌ర్ నుంచి అయినా స్టార్ట్ చేద్దామ‌ని భావిస్తున్నార‌ట‌. అయితే తాజా స‌మాచారం ప్ర‌కారం న‌వంబ‌ర్‌లోనూ ఈ చిత్రాన్ని మొద‌లుపెట్ట‌డం లేద‌ని తెలిసింది. స్వ‌యంగా నిర్మాత క‌ళానిథిమార‌న్ ఈ చిత్రాన్ని జ‌న‌వ‌రిలో మొద‌లుపెడ‌దామ‌ని చెప్ప‌డం ఆస‌క్తిక‌రంగా మారింది.

కార‌ణం ర‌జ‌నీ కోస‌మేనిని తెలిసింది. తలైవ‌ర్ ఏజ్ 69. ఈ ఏజ్ వాళ్ల‌కు క‌రోనా అత్యంత ప్ర‌మాదంగా మారే అవ‌కాశం వుండ‌టంతో ర‌జ‌నీని జ‌న‌వ‌రిలో మాత్ర‌మే సెట్‌లోకి ర‌మ్మంటున్నార‌ట‌. ఇటీవ‌ల ఓ టీవీ ఛాన‌ల్ నిర్వ‌హించిన సంగీత కార్య‌క్ర‌మంలో పాల్గొన్న ఎస్పీ బాల‌సుబ్ర‌హ్మ‌ణ్యం క‌రోనా సోకి తీవ్ర అనారోగ్యానికి గురై మృతి చెందిన విష‌యం తెలిసిందే. ఆ భ‌యం కార‌ణంగానే ర‌జ‌నీ కోసం క‌ళానిథి మార‌న్ షూటింగ్ మ‌రో మూడు నెల‌ల పాటు నిలిపి వేద్దామ‌ని డేరింగ్ స్టెప్ తీసుకున్నార‌ట‌. దీని వ‌ల్ల రిలీజ్ ఆల‌స్య‌మైనా ఫ‌ర‌వాలేదు కానీ ర‌జ‌నీకి మాత్రం ఎలాంటి ఇబ్బందులు త‌లెత్త‌డానికి వీల్లేద‌ని తాజా నిర్ణ‌యం తీసుకున్నార‌ట‌.

Read more RELATED
Recommended to you

Latest news