బిగ్ బాస్ కంటెస్టెంట్ ను ఘోరంగా అవమానించిన రష్మీ గౌతమ్..!

-

వెండితెర నటులతో పాటు ఇప్పుడు బుల్లితెర నటులు కూడా సమానంగా ఫేమస్ అవుతున్నారు. చెప్పాలంటే హీరోలు ఏడాదికి ఒకటి రెండు సినిమాలలో మాత్రమే కనిపిస్తారు. కానీ బుల్లితెర నటులు అలా కాదు.. వారానికి ఒకసారి దర్శనమిస్తూ అభిమానులకు మంచి ఎంటర్టైన్మెంట్ అందిస్తున్నారు. ఇకపోతే ఈ మధ్యకాలంలో టెలివిజన్ లో బాగా ప్రసారమయ్యే షోలు మంచి రేటింగ్స్ కూడా సొంతం చేసుకుంటున్నాయి. అలాంటి వాటిలో ముఖ్యంగా జబర్దస్త్ , ఎక్స్ట్రా జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ వంటి షోలు అభిమానులను పూర్తిస్థాయిలో ఆకట్టుకుంటున్నాయని చెప్పవచ్చు.

అయితే ఇదిలా ఉండగా తాజాగా శ్రీదేవి డ్రామా కంపెనీ షో కి బిగ్ బాస్ కు సంబంధించిన కంటెస్టెంట్లను అతిధులుగా ఆహ్వానించారు. జెర్సీ, మెహబూబ్, యాంకర్ స్రవంతి మొదలైన వారు ఈ షో కి హాజరవడం జరిగింది. వీరిని పాయింట్ బ్లాక్ పెట్టి ప్రశ్నలు అడిగి వారిని ఇబ్బంది పెట్టేసింది యాంకర్ రష్మి. ఓపెన్ హార్ట్ విత్ రష్మీ అంటూ వారిని ఎన్కౌంటర్ చేసే ప్రశ్నలు అడగడం ఇప్పుడు మరింత వైరల్ గా మారింది..

ముందు జెస్సీని ఇబ్బంది పెట్టిన ఆమె.. ఆ తర్వాత స్రవంతి అనగానే డబుల్ మీనింగ్ డైలాగులు చులకనగా మాట్లాడుతారు ఎందుకని అని యాంకర్ స్రవంతిని ప్రశ్నించింది రష్మీ.. ఇక మీకు బాగా అమ్మాయిల పిచ్చి ఉందని అర్థం వచ్చేలా బిగ్ బాస్ కంటెస్టెంట్ జెస్సిని కూడా ప్రశ్నించడంతో షో లో ఉన్న వారంతా ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ప్రోమో నెట్టింట చాలా వైరల్ గా మారుతుంది. ఇది చూసిన చాలా మంది షో కి పిలిచి.. ఇలా అవమానించింది ఏంటి అంటూ కొంతమంది కామెంట్లు చేస్తుంటే మరికొంతమంది టీఆర్పి రేటింగ్ కోసమే ఇదంతా అంటూ కామెంట్లు చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version