ఆ సినిమా చూసి కన్నీళ్లు పెట్టుకున్నా: రష్మిక

-

‘బేబీ’ సినిమా చూసి కన్నీళ్లు పెట్టుకున్నానని హీరోయిన్‌ రష్మిక పేర్కొన్నారు. టాలీవుడ్ యంగ్ హీరో ఆనంద్‌ దేవరకొండ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ బేబీ. యూట్యూబర్ వైష్ణవి చైతన్య హీరోయిన్​గా ఈ సినిమాతో టాలీవుడ్​లోకి ఎంట్రీ ఇచ్చింది. విరాజ్‌ అశ్విన్‌ ప్రధాన పాత్రల్లో నటించిన యూత్‌ఫుల్‌ లవ్‌ ఎంటర్‌టైనర్‌ ‘బేబీ’ని సాయిరాజేశ్‌ తెరకెక్కించాడు.

ఇది ఇలా ఉండగా, ‘బేబీ’ సినిమా చూసి తాను ఎమోషనల్ అయ్యానని హీరోయిన్ రష్మిక ట్విట్ చేశారు. ‘నేను బేబీ మూవీ చూశాను. ఈ సినిమాలోని సీన్స్ చాలా కాలం పాటు నా హార్ట్ లో నిలిచిపోతాయి. ఇందులో నటినటుల పెర్ఫార్మన్స్ చూసి కన్నీళ్లు పెట్టుకున్నాను. మూవీ టీమ్ కు కంగ్రాట్స్’ అని పేర్కొన్నారు. సాయి రాజేష్ దర్శకత్వంలో ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య, విరాజ్ కలిసి నటించిన ఈ మూవీ తొలిరోజు రూ. 7.1 కోట్ల వసూళ్లు రాబట్టింది.

Read more RELATED
Recommended to you

Latest news