అలా అని మీకెవరు చెప్పారు.. నెటిజన్ పై రష్మిక ఫైర్

-

నేషనల్ క్రష్, కన్నడ బ్యూటీ రష్మిక మందన్న ఇటీవలే ‘యానిమల్‌’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకొచ్చి మెప్పించింది. ప్రస్తుతం రష్మిక తన నెక్స్ట్ ప్రాజెక్టులతో బిజీబిజీగా ఉంది. అయితే తాజాగా రష్మిక గురించి సోషల్ మీడియాలో ఓ రూమర్ చక్కర్లు కొడుతోంది. ఈ భామ “ఆడవాళ్లు మీకు జోహార్లు’ చిత్రంలో కేవలం డైరెక్టర్, హీరో కోసమే చేశానని ఓ ఇంటర్వ్యూలో చెప్పినట్టు వార్తలు వైరల్ అవుతున్నాయి. ఈ పుకార్లపై తాజాగా రష్మిక స్పందించింది. ఆ పోస్టు పెట్టిన ఓ నెటిజన్పై తీవ్రంగాఫైర్ అయింది.

‘అలా అని ఎవరు చెప్పారు? నేను కథను నమ్మి మాత్రమే సినిమాలు చేస్తాను. అలాంటి యాక్టర్లతో సినిమా చేయడం ఒక గౌరవం. అసలు ఇలాంటి వార్తలు ఎక్కడ మొదలవుతాయో’ అంటూ రష్మిక ఘాటుగా స్పందించింది. గతంలో రష్మికకు రెమ్యునరేషన్ పెంచేసినట్లు కూడా పుకార్లు రాగా వాటిని సైతం నమ్మవద్దు అంటూ ఆమె క్లారిటీ ఇచ్చారు. ఇక రష్మిక ఓవైపు పుష్ప-2, మరోవైపు ది గర్ల్ఫ్రెండ్ సినిమాలతో పాటు మరికొన్ని చిత్రాలతో బిజీగా ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news