2.ఓ తెలుగు రైట్స్.. టాపు లేచిపోయింది

-

సూపర్ స్టార్ రజినికాంత్ సినిమా అంటే కేవలం తమిళంలోనే కాదు తెలుగులో కూడా ఆ సినిమాకు మంచి క్రేజ్ ఉంటుంది. కోలీవుడ్ తో ఈక్వల్ గా డబ్బింగ్ సినిమాలు తెలుగులో వసూళు చేసిన సందర్భాలు ఉన్నాయి. ఈమధ్య కొన్ని సినిమాలు తెలుగులో కాస్త లాసులు వచ్చేలా చేసినా రజిని సినిమా అంటే నూతన ఉత్సాహం ఉంటుంది. లేటెస్ట్ గా రజిని, శంకర్ కాంబినేషన్ లో వస్తున్న 2.ఓ సినిమా తెలుగులో కూడా భారీగా రిలీజ్ అవుతుంది.

నవంబర్ 29న రిలీజ్ అవుతున్న ఈ సినిమాను తెలుగులో ఎస్విఆర్ మీడియా కొనేసిందట. దాదాపు 80 కోట్లకు వీరు 2.ఓ రైట్స్ కొన్నారని టాక్. కబాలి, కాలా సినిమాలు తెలుగులో ఆశించిన ఫలితాన్ని ఇవ్వకున్నా శంకర్, రజిని కాంబినేషన్ మీద ఉన్న నమ్మకంతో 2.ఓ తెలుగులో టాపు లేచిపోయే బిజినెస్ చేసింది. సినిమా ట్రైలర్ అంచనాలను పెంచగా అందుకు తగినట్టుగా సినిమా ఉంటే రికార్డులు సృష్టించడం ఖాయమని చెప్పొచ్చు.

లైకా ప్రొడక్షన్స్ బ్యానర్ లో వస్తున్న 2.ఓ సినిమాలో రజినికి ప్రతినాయకుడిగా బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ నటించాడు. ఎమీ జాక్సన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు ఏ.ఆర్.రహమాన్ మ్యూజిక్ అందిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version