BREAKING : ఆర్జీవీ ‘వ్యూహం’ సినిమా విడుదలకు బ్రేక్

-

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల నేపథ్యంలో సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ వ్యూహం సినిమాను తెలకెక్కించిన విషయం తెలిసిందే. రాజకీయాల నేపథ్యంలో ఈ సినిమా ఉండడంతో ఈ చిత్రానికి అడుగడుగునా అడ్డంకులే ఎదురయ్యాయి.

RGV Vyuham movie release break

ముందుగా సెన్సార్ బోర్డు విడుదలకు అనుమతిని నిరాకరించింది ఆ తర్వాత కొన్ని మార్పులు, చేర్పులు చేసి ఎలాగో అలాగా సెన్సార్ నుంచి అడ్డంకులను రాంగోపాల్ వర్మ క్లియర్ చేసుకున్నారు. అయితే తాజాగా రాంగోపాల్ వర్మకు తెలంగాణ రాష్ట్ర హైకోర్టు షాక్ ఇచ్చింది. ఆర్జీవీ ‘వ్యూహం’ సినిమా విడుదలకు బ్రేక్ పడింది. వ్యూహం సినిమా సెన్సార్ బోర్డ్ అనుమతిని రద్దు చేసింది తెలంగాణ హైకోర్టు. మూడు వారాల్లోగా కమిటీ సినిమాను పరిశీలించాలని ఆదేషించింది తెలంగాణ హైకోర్టు.

Read more RELATED
Recommended to you

Exit mobile version