కాంతార హీరోకు ఘోర ప్రమాదం…!

-

 

కాంతార చాప్టర్-1 షూటింగ్ లో హీరో రిషబ్ శెట్టి సహా మరి కొంత మంది కళాకారులకు తృటిలో ప్రమాదం తప్పినట్లు తెలుస్తోంది. కర్ణాటకలోని మాని జలాశయంలో నిన్న రాత్రి షూటింగ్ జరుగుతున్న సమయంలో బోటు నీటిలో మునిగిపోయింది. ఈ సమయంలో హీరో రిషబ్ శెట్టితో సహా 30 మంది నటీనటులు, అందులో పని చేసే సిబ్బంది ఉన్నారు.

Rishab Shetty and crew unhurt after boat capsizes during Kantara Chapter 1 shoot
Rishab Shetty and crew unhurt after boat capsizes during Kantara Chapter 1 shoot

వెంటనే వారందరూ నీటిలో నుంచి ఈదుకుంటూ ఒడ్డుకు చేరుకోవడంతో ప్రమాదం తృటిలో తప్పింది. కాగా, ఈ సినిమా చిత్రీకరణ సమయంలో ముగ్గురు వ్యక్తులు వివిధ కారణాలతో మరణించిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఈ ప్రమాదం జరగడంతో చిత్ర బృందం సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటివరకు ఏ సినిమా చిత్రీకరణ సమయంలో ఇలా జరగలేదని ఇప్పుడు కాంతార సినిమా షూటింగ్ సమయంలో ఇలా జరగడంతో ప్రతి ఒక్కరూ భయాందోళనకు గురవుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news