సాయిధరమ్ సంచలన నిర్ణయం..సినిమాలకు బ్రేక్ !

-

సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ గురించి మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. మెగా కాంపౌండ్ నుంచి ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి.. పిల్ల నువ్వు లేని జీవితం అనే సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయమయ్యాడు . ఇక ఈ సినిమాతో మంచి విజయాన్ని సొంతం చేసుకొని వరుస సినిమాలు చేస్తూ తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును చాటుకున్నారు సాయిధరమ్ తేజ్.

కాగా, పవన్ తో కలిసి నటించిన ‘బ్రో’ సినిమా ఈ నెల 28న విడుదల కానుండగా… ఆ తర్వాత ఆరు నెలలు బ్రేక్ తీసుకొనున్నట్లు సాయిధరమ్ తేజ్ వెల్లడించారు. సినిమా ప్రమోషన్లలో భాగంగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ…’చిన్న సర్జరీ చేయించుకోవాల్సి ఉంది. సంపూర్ణంగా తోలుకోవడానికి ఈ టైం ను సద్వినియోగం చేసుకుంటా’ అని పేర్కొన్నారు. ఈయన 2021లో రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. ఆ తర్వాత ‘విరూపాక్ష’ మూవీలో నటించగా సూపర్ హిట్ సాధించింది.

Read more RELATED
Recommended to you

Latest news