ఏపీ అప్పులపై కేంద్రానికి ఫిర్యాదు చేస్తాం – పురంధేశ్వరి

-

ఏపీ అప్పులపై కేంద్రానికి ఫిర్యాదు చేస్తామని బీజేపీ ఏపీ చీఫ్‌ పురంధేశ్వరి హెచ్చరించారు. సిద్దాంతపరంగా భావజాలం కుదరని పార్టీలతో విపక్షాల కూటమి ఏర్పడిందని.. బీజేపీని ఓడించేందుకే కూటమిగా ఏర్పడ్డారని వివరించారు. కాంట్రాక్టర్లకు చెల్లించాల్సిన బిల్లులతో సహా గత ప్రభుత్వ హయాంలో రూ. 2.65 లక్షల కోట్ల మేరకు అప్పు చేశారని.. జగన్ ప్రభుత్వం నాలుగేళ్ల కాలంలో రూ. 7.14 లక్షల కోట్ల మేర అప్పు ఉందని ఆరోపణలు చేశారు.

మద్యం ద్వారా ఆదాయం పైనా రూ. 8300 కోట్లు తెచ్చారని.. వైసీపీ ప్రభుత్వం రూ. 71 వేల కోట్ల మేర బిల్లులు చెల్లించాల్సి ఉంటుందని వివరించారు. ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్రానికి సొంత వనరుల ద్వారా వచ్చే ఆదాయం రూ. 90 వేలు వస్తోందని తెలిపారు. డెవల్యూషన్ కింద కేంద్రం రూ. 35 వేల కోట్లు ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్రానికి ఇస్తోందని..40 శాతం వడ్డీలకే కడుతున్నారని పేర్కొన్నారు.
అనధికార అప్పులే రూ. 4 లక్షల కోట్లకు పైగా ఉందని.. అనధికార అప్పులపై శ్వేత పత్రం విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. బడుగులకు న్యాయం చేసేందుకే అప్పులు చేస్తున్నామని ప్రభుత్వం చెబుతోంది.. ఏం చేశారు..? అని ప్రశ్నించారు. ఆస్తులను సృష్టించాల్సిన ప్రభుత్వం.. ఉన్న ఆస్తులను తనఖా పెట్టి రుణాలు తెచ్చుకుంటోంది.భూములు తనఖా పెట్టి వచ్చిన రుణంతో టిడ్కో ఇళ్ల నిర్మాణం చేస్తారా..అని నిలదీశారు పురంధేశ్వరి.

Read more RELATED
Recommended to you

Latest news