తన గురించి షాకింగ్ విషయం చెప్పిన సాయి పల్లవి…!

-

సాయి పల్లవి… చేసిన సినిమాలు తక్కువే అయినా సరే ఈ అమ్మాయికి ఉండే ఫ్యాన్ ఫాలోయింగ్ మాత్రం ఒక రేంజ్ లో ఉంటుంది. సినిమా చేస్తే హీరోని డామినేట్ చేయడం ఈమెకు ఉన్న ప్రత్యేక శైలి. ఏ సినిమా అయినా సరే ఆమె హీరోని ఎక్కువగా డామినేట్ చేస్తూ ఉంటుంది. తెలుగులో ఆమె చేసిన ఫిదా సినిమా టాలీవుడ్ ప్రేక్షకులకు బాగా నచ్చేసింది. ఆ తర్వాత ఆమె చేసిన ఎంసిఏ సినిమా కూడా అదే స్థాయిలో గుర్తింపు తీసుకొచ్చింది.

ఇప్పుడు ఆమె రానా పక్కన ఒక సినిమాలో నటిస్తుంది. తెలంగాణ నేపథ్యంలో పీరియాడికల్‌ ప్రేమకథగా, రాజకీయ థ్రిల్లర్‌గా వస్తున్న విరాట పర్వం అనే సినిమాలో ఆమె నటిస్తుంది. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో లవ్ స్టోరీ అనే సినిమాలో ఆమె నటిస్తుంది. తాజాగా ఆమె ఇచ్చిన ఒక ఇంటర్వ్యులో ఆమె కొన్ని కీలక విషయాలు చెప్పారు. తాను నటి కాకపోయి ఉంటే ఎంబీబీఎస్‌ తరవాత కార్డియాలజీ ఎంచుకుని కార్డియాలజీస్ట్ అయ్యేదాన్నని వివరించారు.

ఎవరికి తెలియని విషయం చెప్పండని ప్రశ్నించగా… తమది తమిళనాడులోని బడుగ అనే గిరిజన తెగ అని వివరించింది. మా భాష బడుగకు లిపి లేదని చెప్పిన ఆమె… ఇక ఎప్పుడైన ఏడ్చారా.. అని ఆమెను అడగగా… ఎన్జీకే సమయంలో చేసిన సీన్‌నే పదే పదే రీషూట్‌ చేస్తుండేవారని… దాంతో ఒకరోజు సినిమాలను వదిలేస్తానని అమ్మకు చెప్పి ఇంట్లో ఏడ్చేశాను అని తన అనుభవం వివరించింది సాయి పల్లవి.

Read more RELATED
Recommended to you

Latest news