జీహెచ్ఎంసీ పార్కుని ద‌త్త‌త తీసుకోబోతున్న శ‌ర్వానంద్…!

-

తెలంగాణ రాష్ట్రంలో గ్రీన్ ఇండియా ఛాలెంజ్ మంచి ఫలితాలను ఇస్తుంది. హరితహారం కార్యక్రమంలో భాగంగా రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ మొదలుపెట్టిన ఈ కార్యక్రమం ప్రస్తుతం తెలంగాణలో హాట్ టాపిక్ గా కొనసాగుతోంది. ఇందులో భాగంగా అనేక మంది రాజకీయ, సినీ వర్గాలకు సంబంధించిన ప్రముఖులు పాల్గొంటూ… వారితో పాటు మరొకరికి ఈ ఛాలెంజ్ ను ఇస్తున్నారు. ఇందులో భాగంగానే టాలీవుడ్ ప్రముఖ నటుడు హీరో శర్వానంద్ బంజారాహిల్స్ లోని తన ఇంటి పక్కన ఉన్న పార్కులో మొక్కలను నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… భవిష్యత్తులో మనం ఆక్సిజన్ కొనే పరిస్థితి రావచ్చు, దీన్ని నివారించేందుకు మొక్కలు నాటడం ఒకటే మార్గమని తెలియజేశాడు.

servand
servand

అలాగే తన ఇంటి పక్కన ఉన్న జిహెచ్ఎంసి పార్కును ఆయన దత్తత తీసుకొని పార్కులోని వాకింగ్ ట్రాక్ పనులకు, పార్కుల అభివృద్ధి కి అవసరమయ్యే ఖర్చు మొత్తం తను భరిస్తానని తెలియజేశారు. రాజ్యసభ సభ్యుడు సంతోష్ అన్న చేపట్టిన ఈ చాలెంజ్ చాలా సక్సెస్ గా సాగుతోందని తెలియజేశారు. ఆయనను స్ఫూర్తిగా తీసుకొని నేను ఈ కార్యక్రమం చేపడుతున్నారని శర్వానంద్ స్పష్టం చేశారు. ఈ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమంలో హీరో శర్వానంద్ తో పాటు సంతోష్ కుమార్, ఆర్. రామ్ మోహన్, దానం నాగేందర్ మొదలగు ప్రముఖులు పాల్గొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news