సుడిగాలి సుధీర్ రేంజ్ మారిపోయే సినిమా..!!

-

టాలీవుడ్ ఇండస్ట్రీలో కొంతమంది కమెడియన్స్ హీరోలుగా అడుగులు వేసి మంచి గుర్తింపునందుకున్నారు. అయితే ఇప్పుడు జబర్దస్త్ కమెడియన్ సుధీర్ కూడా తన ప్రయాణాన్ని మొదలుపెట్టాడు. ఇదివరకే అతను కొన్ని సినిమాలు చేశాడు. కానీ అవి ఏమీ అంతగా సక్సెస్ కాలేదు. కానీ ఇటీవల వచ్చిన గాలోడు సినిమా మాత్రం బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్స్ అందుకోవడంతో అతని రేంజ్ ఒక్కసారిగా పెరిగిపోయింది. అప్పట్లో  బాక్ గ్రౌండ్ లేని హీరోనే విష్ణు సినిమా కంటే ఎక్కువ వసూళ్ళు సాధించాడు అంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ హల్చల్ చేశాయి.

ఇక సుదీర్ తో చాలా మంది సినిమాలు చేయటానికి ముందుకు వస్తున్నారు. ఎందుకంటే తన సినిమాలు మినిమం గ్యారెంటీ గా ఉంటాయి. మంచి కథ పడితే మాత్రం లాభాలు వచ్చే అవకాశం ఉందని వారు నమ్ముతున్నారు. ఇక రీసెంట్ గా కూడా కొంతమంది కొత్త దర్శకులు అతనికి కథలు కూడా చెప్పినట్లుగా తెలుస్తోంది. కాని సుదీర్ మాత్రం చాలా సెలెక్టివ్ గా కథలు వింటున్నాడని అంటున్నారు.

కాగా రీసెంట్ గా సుధీర్ ఒక ప్రముఖ దర్శకుడు తో సినిమా చేసేందుకు చర్చలు జరిపినట్లు గుస గుసలు వినిపిస్తున్నాయి.ఆదర్శకుడు మరెవరో కాదు ఒకప్పుడు రచయితగా మంచి గుర్తింపుని అందుకొని ఆ తర్వాత దర్శకుడుగా మారిన వీరు పోట్ల అని తెలుస్తోంది. వర్షం, నువ్వొస్తానంటే నేనొద్దంటానా కథలను అందించిన వీరుపోట్ల ఆ తర్వాత దర్శకుడు గా మారిన తర్వాత  నాగర్జునతో అతను చేసిన రగడ సినిమా కమర్షియల్ హిట్ సాధించింది. ప్రస్తుతం తాను సుదీర్ కు మంచి కథ చెప్పి ఒప్పించి నట్లు తెలుస్తోంది. ఇదే నిజం అయితే సుదీర్ కొంచం పెద్ద రేంజ్ కు వెళ్ళే అవకాశం ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news