ఎమ్మెల్యేల కొనుగోలు కేసుతో నాకెలాంటి సంబంధం లేదు : అభిషేక్

-

ఎమ్మెల్యేలకు ఎర కేసుకు తనకు ఎలాంటి సంబంధం లేదని సెవెన్ హిల్స్‌ మాణిక్‌ చంద్‌ ప్రొడక్ట్స్‌ కంపెనీ అదనపు డైరెక్టర్ అభిషేక్ ఆవల స్పష్టం చేశారు. పైలట్‌ రోహిత్ రెడ్డితో ఎలాంటి వ్యాపార లావాదేవీలు లేవన్నారు. ఈడీ కార్యాలయంలో విచారణకు హాజరయిన అభిషేక్ ఆవల.. ఈడీ విచారణకు పూర్తిగా సహకరిస్తానని వెల్లడించారు.

మాణిక్ చంద్‌ పాన్‌ మసాలాల లావాదేవీల విషయంలోనే ఈడీ అధికారులు తనకు నోటీసులు జారీ చేశారని తెలిపారు. రోహిత్ రెడ్డి సోదరుడు రితిష్ రెడ్డితో వ్యాపార లావాదేవీలున్నాయని పేర్కొన్నారు. నందుకుమార్‌ మోసం చేసిన విషయంలో ఇది వరకే బంజారాహిల్స్ పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేశామన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news