తెలుగు రాష్ట్రాలకు తమిళ హీరో విజయ్ విరాళం…!

-

కరోనా వైరస్ కట్టడిలో భాగంగా ఎవరి వంతు ప్రయత్నం వారు చేస్తున్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు తమ వంతుగా భారీ విరాళం అందిస్తున్నారు. రాజకీయ, సినీ క్రీడా ప్రముఖులు తమ వంతుగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు సాయం చేస్తున్నారు. టీం ఇండియా ఆటగాళ్ళు ఇప్పటికే తమ విరాళాలు అందించారు. మన తెలుగులో చిరంజీవి, ప్రభాస్, రామ్ చరణ్, ఎన్టీఆర్ రానా ఇలా అందరూ విరాళాలు ఇచ్చారు.

ఇక బాలీవుడ్ హీరోలు కూడా భారీ విరాళాలు ఇచ్చారు. అక్షయ్ కుమార్ ఏకంగా 25 కోట్లకు పైగా సహాయం చేసాడు. తర్వాత మరో 3 కోట్ల రూపాయలను సాయం చేసాడు. ఇక తమిళ స్టార్ హీరో విజయ్ తెలుగు రాష్ట్రాలకు సహాయం చేయడానికి ముందుకి వచ్చారు. రెండు తెలుగు రాష్ట్రాలకు చెరో 5 లక్షల రూపాయలను ఆర్థిక సహాయం చేసాడు. అలాగే వివిధ రాష్ట్ర ప్రభుత్వాలకు కూడా సహాయం అందించాడు.

కేంద్ర ప్రభుత్వానికి, రాష్ట్రాలకు కలిపి మొత్తం 1.3 కోట్లను విరాళంగా ఇచ్చాడు. కర్ణాటక, పుదిచ్చేరి రాష్ట్రాలకు చెరో రూ.5 లక్షలు, కేరళకు రూ.10 లక్షలు, స్వరాష్ట్రం తమిళనాడుకు రూ.50 లక్షలు, కేంద్ర ప్రభుత్వ సహాయనిధికి రూ.25 లక్షలు, దక్షిణ భారత నటుల సంఘానికి రూ.25 లక్షలు విరాళం ఇచ్చాడు విజయ్. ప్రధాని సహాయ నిధి, ముఖ్యమంత్రుల సహాయ నిధికి వీటిని ఇస్తాడు.

Read more RELATED
Recommended to you

Latest news