తెలుగు సినీ దర్శకుల సంఘం అధ్యక్షుడిగా వీర శంకర్

-

తెలుగు సినీ దర్శకుల సంఘం ఎన్నికల్లో వీర శంకర్‌ ప్యానల్ ఘన విజయం సాధించింది. సంఘం ప్రెసిడెంట్‌గా గుడుంబా శంకర్ డైరెక్టర్ వీర శంకర్‌, వైస్‌ ప్రెసిడెంట్‌లుగా బింబిసార ఫేం వశిష్ఠ, బేబీ’ డైరెక్టర్ సాయి రాజేశ్‌ ఎన్నికయ్యారు. ఆదివారం ఉదయం 8 గంటల నుంచి 4 గంటల వరకు ఈ ఎన్నికలు నిర్వహించారు. అనంతరం, ఫలితాలు వెలువడ్డాయి. దర్శకుల సంఘంలో దాదాపు 1500 మంది యాక్టివ్‌గా ఉన్నట్లు తెలుస్తోంది.

ఇవాళ జరిగిన ఎన్నికల్లో 1113 ఓట్లు పోలవ్వగా.. వీర శంకర్‌కు 536, ప్రత్యర్థి సముద్రకు 304 ఓట్లు పడ్డాయి. నూతన కార్యవర్గం రెండేళ్లు కొనసాగుతుంది. మరోవైపు వీర శంకర్‌ గతంలోనూ అధ్యక్షుడిగా పని చేశారు. వీర శంకర్‌.. ‘హలో: ఐ లవ్‌ యూ’, ‘ప్రేమ కోసం’, ‘విజయరామరాజు’, ‘గుడుంబా శంకర్‌’ తదితర చిత్రాలకు దర్శకత్వం వహించారు. ‘జాతి రత్నాలు’, ‘విరాటపర్వం’ వంటి సినిమాల్లో నటించారు. ఇక ‘బింబిసార’తో తొలి ప్రయత్నంలోనే అందరి దృష్టి ఆకర్షించిన వశిష్ఠ ప్రస్తుతం చిరంజీవితో ‘విశ్వంభర’ సినిమా తెరకెక్కిస్తున్నారు. ‘బేబీ’తో సాయి రాజేశ్‌ ఘన విజయం అందుకున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news