నీకు మాత్రమే చెప్తా అంటూ.. కొత్త అవతారమెత్తిన దర్శకుడు

-

పెళ్లి చూపులు సినిమాతో దర్శకుడిగా తన ప్రతిభను నిరూపించుకున్నాడు తరుణ్ భాస్కర్. ఫలక్‌నుమా దాస్, మీకు మాత్రమే చెప్తా అంటూ నటుడిగా తన సత్తాను చాటాడు. ఇలా మల్టీ టాలెంటెడ్‌గా తన లోని భిన్న కోణాలు ప్రేక్షకులకు పరిచయం చేస్తున్నాడు. తాజాగా మరో కొత్త అవతారమెత్తి ప్రేక్షకులను మెప్పించేందుకు వస్తున్నాడు. ఆ విశేషాలేంటో ఓ సారి చూద్దాం.

కొంచెం టచ్‌లో ఉంటే చెప్తా, నెం. 1 యారీ, అలీతో సరదాగా వంటి షోలు తెలుగు నాట ఎంతగా పాపులర్ అయ్యాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సెలెబ్రిటీలను గెస్ట్‌లుగా తీసుకురావడం, వారి సీక్రెట్స్‌ను అభిమానుల ముందు ఉంచడం, వారి జీవితంలో జరిగిన ముఖ్య సంఘటనల గురించి అందరికీ తెలిసేలా చేయడం వంటివి చేస్తుంటారు. తాాజాగా ఈ జాబితాలోకి చేరేందుకు నీకు మాత్రమే చెప్తా అనే కార్యక్రమం ప్రారంభంకాబోతోంది. దీనికి హోస్ట్‌గా తరుణ్ భాస్కర్ వ్యవహరించబోతోన్నాడు.

మొదటి గెస్ట్‌గా దర్శకుడు అనిల్ రావిపూడి వచ్చినట్టు తెలుస్తోంది. ఈ కార్యక్రమానికి సంబంధించిన ఫోటోలను షేర్ చేస్తూ.. ‘తరుణ్ భాస్కర్ హోస్ట్‌గా వ్యవహరించే నీకు మాత్రమే టాక్ షోను ఎంతో సహజంగా నడిపించాడు. నాకు ఈ షోలో గడిపిన సమయం ఎంతో అనుభూతిని ఇచ్చింది. ఈ షోను చూడాలని ఎంతో ఆత్రుతగా ఉన్నా. శరత్ బొద్దనపల్లి షోను బాగా డిజైన్ చేశార’ని ట్వీట్ చేశాడు.

 

Read more RELATED
Recommended to you

Latest news