నిఘావర్గాల వార్నింగ్.. ‘ది కేరళ స్టోరీస్‌’ విడుదలైతే తమిళనాట నిరసనలు

-

గత కొద్దిరోజులుగా ది కేరళ స్టోరీ సినిమాపై సర్వత్రా విమర్లు వెల్లువెత్తుతున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా కేరళ రాజకీయ పక్షాలు ఈ సినిమాపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ చిత్రం విడుదలైతే పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తం అవుతాయని నిఘా వర్గాలు హెచ్చరించాయి. ముఖ్యంగా తమిళనాట అగ్గిరాజుకుంటుంది అని వార్నింగ్ ఇచ్చాయి.

ఈ సినిమా ట్రైలర్‌ ఏప్రిల్‌ 6వ తేదీన విడుదలై తీవ్ర చర్చకు దారితీసింది. ఇది య థార్థ సంఘటన అని, ఇప్పటి వరకు 32 వేల మంది మహిళలు మతం మారినట్లు చిత్ర వర్గాలు పేర్కొంటున్నాయి. తమిళనాడులో ఈ సినిమా విడుదలైతే పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తం అవుతాయని రాష్ట్ర పోలీసుశాఖను నిఘా వర్గాలు హెచ్చరించాయి. శాంతిభద్రతలకు సమస్య ఏర్పడుతుందని, ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాలని తెలిపింది.

సినిమా రాష్ట్రంలో విడుదల కాకుండా చూడడం మంచిదని సిఫారసు చేసినట్లు తెలుస్తోంది. ఈ విషయమై రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, హోంశాఖ కార్యదర్శి, డీజీపీలతో ముఖ్యమంత్రి స్టాలిన్‌ చర్చించి నిర్ణయం తీసుకుంటారని పోలీసు వర్గాల సమాచారం.

Read more RELATED
Recommended to you

Exit mobile version