గుండెను పిండేస్తున్న హరికృష్ణ అభిమానులకు రాసిన చివరి లేఖ

-

హరికృష్ణ మరణం అటు సిని రాజకీయ వర్గాల్లో పెను విషాదాన్ని మిగిల్చింది. అభిమాని కొడుకు పెళ్లి కోసం హైదరాబాద్ నుండి నెల్లూరు వెళ్తున్న హరికృష్ణ మార్గమధ్యంలోనే అనంతలోకాలకు వెళ్లారు. ఎవరు ఊహించని విధంగా జరిగిన ఈ దుర్ఘటన పట్ల తెలుగు రెండు రాష్ట్రాల్లో విషాద ఛాయలు అలముకున్నాయి.

సెప్టెంబర్ 2న హరికృష్ణ బర్త్ డే. ఆ రోజు కోసం తన అభిమానులకు ఓ లెటర్ ప్రిపేర్ చేసుకున్నారు హరికృష్ణ. బహుశా అదే ఆయన రాసిన చివరి లేఖ కావొచ్చు. ఇప్పుడు ఆ లేఖ బయటకు వచ్చింది. తన పుట్టినరోజు నాడు అభిమానులెవరు పుష్కగుచ్చాలు, బొకేలు, ఫ్లెక్సీలు పెట్టొద్దని.. దానికి అయ్యే ఖర్చు ఇటీవల వరదల వల్ల నష్టం జరిగిన కేరళ ప్రజలకు, ఏపిలో భారీ వర్షాల కారణంగా నష్టపోయిన వారికి ఇవ్వాల్సిందిగా కోరారు.

ప్రచురణార్ధం ఇచ్చిన ఆ లేఖ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఈ ఒక్క లెటర్ చాలు హరికృష్ణ మనసు ఎంత గొప్పదో అని చెప్పడానికి. తెలుస్తున్న సమాచారం ప్రకారం రేపు హరికృష్ణ అంత్యక్రియలు జరుగుతాయట. మొయినాబాద్ లోని ఫాం హౌజ్ లో హరికృష్ణ అంతిమ సంస్కారాలు జరుగుతాయని సమాచారం.

Read more RELATED
Recommended to you

Exit mobile version