ఆది పురుష్ రిలీజ్ పై క్లారిటీ ఇచ్చిన మేకర్స్..!

-

తాజాగా యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్.. చేతినిండా సినిమాలతో బిజీగా దూసుకుపోతున్నాడు. అంతేకాదు అప్పుడప్పుడు బుల్లితెర షోలకి కూడా వచ్చి సందడి చేస్తున్న విషయం తెలిసిందే. ఇకపోతే ప్రభాస్ నుంచి సినిమాలు ఎప్పుడు వస్తాయని ఆసక్తిగా ఎదురు చూస్తున్న అభిమానులకు.. తన సినిమాలకు సంబంధించిన అప్డేట్లను అందిస్తూ మరింత పాపులర్ అవుతున్నారు ప్రభాస్. ఇకపోతే ప్రస్తుతం ప్రాజెక్ట్ కె, సలార్ చిత్రాలు శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్నాయి. ఈ సినిమాలు ఒకవైపు షూటింగ్ జరుగుతూ ఉండగా .. మరొకవైపు సైలెంట్ గా డైరెక్టర్ మారుతి రూపొందిస్తున్న సినిమా కూడా షూటింగ్ జరుపుకుంటుంది.

మరోవైపు బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ దర్శకత్వంలో ప్రభాస్ నటించిన చిత్రం ఆది పురుష్. ఇప్పటికే షూటింగ్ కంప్లీట్ చేసుకుని విడుదలకు సిద్ధంగా ఉన్న ఈ సినిమా రిలీజ్ పై ఎప్పటికప్పుడు సందిగ్ధత ఏర్పడుతోందని చెప్పవచ్చు. గతంలో సినిమా నుంచి రిలీజ్ చేసిన టీజర్ పై విమర్శలు రావడంతో వీఎఫ్ఎక్స్ మార్చే పనిలో పడ్డ మేకర్స్.. సంక్రాంతి బరిలో నిలవాల్సిన సినిమాను కాస్త వాయిదా వేశారు. ఇక జూన్ 16వ తేదీన విడుదల చేయబోతున్నట్లు ప్రకటించారు. మరొకవైపు అనుకున్న తేదీకి సినిమా రిలీజ్ కాకపోవచ్చు అని అనుమానాలు వ్యక్తం అవుతుండడంతో.. తాజాగా ఆది పురుష్ సినిమా జూన్ 16వ తేదీన రిలీజ్ కావడం ఖాయం అంటూ ఒక ప్రకటన రిలీజ్ చేశారు.

మరోవైపు ప్రభాస్ రాముడిగా కనిపించడానికి ఇంకా 150 రోజులు ఆగాల్సిందే అని చెప్పడంతో అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇందులో కృతి సనన్, సైఫ్ అలీ ఖాన్ తో పాటు సన్నీ సింగ్, సోనాల్ చౌహన్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news