కంటెస్టెంట్ల మధ్య ద్వేషం.. అప్పుడే బిగ్ బాస్ హౌస్ లో రచ్చ మొదలు..!

-

బిగ్ బాస్ సీజన్ 8 ప్రస్తుతం రెండవ వారం కొనసాగుతోంది. ఫస్ట్ వీక్ లో ఇంటి నుంచి బెబక్క వెళ్ళిపోయింది. మంగళవారం నాడు నామినేషన్ల ప్రక్రియ ఫుల్ హీట్ తో సాగింది. రెండవ వారంలో కంటెస్టెంట్స్ వ్యక్తిగతంగా ఒకరిపై ఒకరు ద్వేషం పెంచుకునే స్థాయికి చేరుకున్నారు. లవ్ ట్రాక్ లో ఉన్నారనుకున్న సోనియా విష్ణుప్రియల మధ్య మార్పు కనబడుతోంది. నిఖిల్ సోనియాల మధ్య కూడా ద్వేషం మొదలైపోయింది. బిగ్ బాస్ లో ఫుడ్ కి సంబంధించిన టాస్క్ జరిగింది. ఈ టాస్క్ లో కాస్త గందరగోళ వాతావరణం మొదలైంది.

యాష్మి, నైనికా టీం సభ్యులు మాత్రమే ఈ టాస్క్ లో గెలిచారు. మిగిలిన వాళ్ళు ఓడిపోయారు. ఓడిపోయిన వారికి ఫుడ్ అందకపోవడంతో సీత ఏడ్చింది. ఫుడ్ టాస్క్ లో ఓడిపోయిన నిఖిల్, మణికంఠ బిగ్ బాస్ పంపిన కూరగాయలు ఉడికించుకుని తింటూ గడుపుతున్నారు. బాగా నీరసంగా ఉంది పల్పి ఆరెంజ్ ముఖాన్ని కొట్టండి అని మణికంఠ అడగక పక్కనే ఉన్న నిఖిల్ వెంటనే రక్తం తాగుతున్నావు కదరా ఇంకేం కావాలి నీకు అంటూ ఘాటుగా స్పందించాడు. రెండో వారం నామినేషన్ లో భాగంగా సోనియా ఇచ్చిన షాక్ నుంచి నిఖిల్ కోలుకోలేక బాధపడుతున్నాడు.

నిఖిల్ ని చూస్తేనే కోపం వస్తోందని సోనియా అభయ్ తో మాట్లాడింది. సమాధానంగా నువ్వు అతన్ని పదే పదే లూజర్ అంటున్నావ్ అంట కదా అతను ఫీల్ అవుతున్నాడు ఇలా తిడుతుంటే ఇంకా ఎలా మాట్లాడుతాడు అని చెప్తాడు. బిగ్బాస్ హౌస్ నాశనం అవ్వాలంటే విష్ణుప్రియ లాంటి వాళ్ళు ఉంటే చాలు అన్నట్లు సోనియా మాట్లాడుతుంది. హౌస్ లో ఆవిడే రెచ్చగొడుతుంది అని అంటుంది. మరి ఇది ఎంత దాకా వెళ్తుంది అనేది చూడాలి

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version