కోర్టు సినిమాకు పాజిటివ్ టాక్.. నా సినిమా సేఫ్ అంటున్న దర్శకుడు శైలేష్ కొలను

-

నేచురల్ స్టార్ నాని సమర్పణలో వాల్ పోస్టర్ బ్యానర్‌పై ప్రశాంతి నిర్మిస్తున్న కొత్త చిత్రం ‘కోర్టు’. ఇందులో ప్రియదర్శి లీడ్ రోల్ చేస్తున్నారు. కొత్త డైరెక్టర్ రామ్ జగదీశ్ దీనికి దర్శకత్వం వహించారు. సరికొత్త కథతో ఈ చిత్రం బృందం ముందుకు వస్తున్నది.చిత్ర షూటింగ్ ఇప్పటికే పూర్తవ్వగా.. ప్రియదర్శి గతంలో కంటే భిన్నంగా ఈ సినిమాలో లాయర్ అవతారం ఎత్తారు.

ఈ మూవీ ఉగాది కానుకగా మార్చి 14న విడుదలకు సిద్ధమైంది. అయితే, ఇటీవల మూవీ ప్రమోషన్లలో భాగంగా ఈ సినిమా బాగాలేక పోతే రాబోయే నా చిత్రం (హిట్-3) చూడకండని హీరో నాని స్టేట్మెంట్ ఇచ్చారు. తన సమర్పణలో వస్తున్న కోర్టు మూవీ మీదున్న నమ్మకంతోనే ఆయన ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం.తాజాగా ఈ సినిమాను కొందరు సెలబ్రెటీలు, మీడియా మిత్రులకు షో వేసినట్లు తెలిసింది. పాజిటివ్ టాక్ రావడంతో హిట్ సినిమా దర్శకుడు శైలేష్ కొలను ట్వీట్ చేశారు. ‘నా సినిమా సేఫ్’ అని మిర్చి సినిమాలొ ప్రభాస్ పోస్టర్‌ను రీఎడిట్ చేసి వాడేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version