టాలీవుడ్ స్టార్ దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు మరోసారి నోటీసులు అందాయి. ఫిబ్రవరి 4న విచారణకి హాజరు కావాలని నోటీసులు జారీ చేశారు ఒంగోలు పోలీసులు. ఈ మేరకు టాలీవుడ్ స్టార్ దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు వాట్సప్కి నోటీసు పంపారు రూరల్ సీఐ శ్రీకాంత్.

సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేశ్ ఫోటోలు మార్ఫింగ్ చేసి ‘ఎక్స్’లో పోస్ట్ చేశారు వర్మ. నవంబర్ 10న వర్మపై మద్దిపాడు పోలీస్ స్టేషన్లో కేసు నమోదు అయింది. నవంబర్ 19, 25 తేదీల్లో రెండు సార్లు నోటీసులు ఇచ్చినా విచారణకి హాజరు కాకుండా కొద్ది రోజులు అజ్ఞాతంలోకి వెళ్లారు వర్మ.