GET READY : ఇవాళ సాయంత్రం 6.03 గంటలకు ‘బ్రో’ ట్రైలర్

-

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సుప్రీం హీరో సాయి ధరంతేజ్ మొదటిసారి నటిస్తున్న చిత్రం బ్రో. సోషియో ఫాంటసీ నేపథ్యంలో వస్తున్న ఈ సినిమా తమిళ సూపర్ హిట్ మూవీ వినోదయ సీతంకి రీమేక్ గా వస్తోంది. ఇక తమిళ్ లో చేసిన సముద్రఖని ఈ సినిమాను రీమేక్ చేస్తూ డైరెక్ట్ చేస్తున్నారు.


అయితే.. మామాఅల్లుళ్లు నటించిన మల్టీ స్టారర్ చిత్రం ‘బ్రో’ ట్రైలర్ నేడు విడుదల కానుంది. విశాఖలోని జగదాంబ థియేటర్ లో సాయంత్రం 6.03 గంటలకు సాయి ధరమ్ తేజ్ విడుదల చేయనున్నారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ మల్టీస్టారర్ గా డైరెక్టర్ సముద్రఖని తెరకెక్కించిన ఈ చిత్రంపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన టీజర్, సాంగ్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఈ చిత్రం జూలై 28న రిలీజ్ కానుంది.

Read more RELATED
Recommended to you

Latest news