పక్క చూపులు చూస్తున్న త్రివిక్రమ్.. మహేష్ ఫ్యాన్స్ ఫైర్..!

-

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న చిత్రం గుంటూరు కారం. ఈ సినిమాపై అంచనాలు భారీగా నెలకొన్నాయి. అయితే అంచనాలకు తగ్గట్టుగా సినిమాను భారీ ఎత్తున విడుదల చేయడానికి మేకర్స్ అంతకుమించి ప్లాన్ చేస్తున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల చేయబోతున్నాము అంటూ విడుదల తేదీని కూడా ప్రకటించిన విషయం తెలిసిందే. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో ఈ సినిమాను సంక్రాంతి పండుగకు తీసుకురావడం సాధ్యమేనా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

ఎందుకంటే సినిమా విడుదల తేదీ దగ్గర పడుతోంది కానీ షూటింగ్ మాత్రం ఇంకా అలాగే ఉంది. ఇప్పటివరకు సగం కూడా పూర్తి కాలేదు. ఏడాది పూర్తయిన సగం షూటింగ్ కూడా పూర్తి కాకపోవడంతో రాబోయే ఆరు నెలల్లో సినిమా మొత్తం పూర్తి అవుతుందా అంటూ కూడా చాలామంది ఫైర్ అవుతున్నారు. ఇకపోతే పెద్ద ఎత్తున సినిమా గురించి అంచనాలు ఉన్నాయి కానీ అంచనాలను తగ్గించే ప్రయత్నం చేస్తున్నాడు త్రివిక్రమ్. ఇకపోతే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం త్రివిక్రమ్ పై మహేష్ అభిమానులు ఫైర్ అవుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

అసలు విషయంలోకెళితే మహేష్ బాబు మరియు త్రివిక్రమ్ కాంబినేషన్లో గుంటూరు కారం సినిమా పూర్తి కాకముందే త్రివిక్రమ్ మరో ప్రాజెక్టును మొదలు పెట్టడానికి కనెక్ట్ అవుతున్నాడు అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. అందుకే ఈ సినిమా పూర్తి కాకముందు ఇంకొక సినిమా ఎలా మొదలు పెడతారు అంటూ మహేష్ అభిమానులు ఫైర్ అవుతున్నారు. మరి ఇప్పటికైనా మహేష్ బాబు జాగ్రత్తలు తీసుకొని తన సినిమాను త్వరగా కంప్లీట్ చేయించుకుంటారా అనే అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. ఎందుకంటే ఈ సినిమా పూర్తి అయిన వెంటనే ఆయన రాజమౌళితో పాన్ వరల్డ్ చిత్రాన్ని తెరకెక్కించాల్సి ఉంటుంది. ఇంత పని ఉన్నప్పుడు మరెందుకు త్రివిక్రమ్ పక్క చూపులు చూస్తున్నాడు అంటూ అభిమానులు ఫైర్ అవుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news