RTC బస్సుల్లో మహిళలకు ఉచితంగా ప్రయాణం – రేవంత్‌ రెడ్డి

-

కాంగ్రెస్‌ పార్టీ అధికారంలో వస్తే, RTC బస్సుల్లో మహిళలకు ఉచితంగా ప్రయాణ సదుపాయం కల్పిస్తామని ప్రకటించారు రేవంత్‌ రెడ్డి. గాంధీభవన్ లో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సమక్షంలో చేరికలు చోటు చేసుకున్నాయి. అచ్ఛంపేట నియోజకవర్గానికి చెందిన మాజీ జెడ్పీటీసీ భీముడు నాయక్, అచ్ఛంపేట, చారగొండ మండలాల బీఆరెస్ కార్యకర్తలు…బీఆరెస్ నుంచి కాంగ్రెస్ లో చేరారు.

ఈ సందర్భంగా కండువాకప్పి పార్టీలోకి ఆహ్వానించిన రేవంత్.. మాట్లాడారు. కొత్త ఏడాదిలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తోందని… ఇల్లు కట్టుకోవడానికి ఐదు లక్షలు ఇస్తామని వెల్లడించారు. ఆరోగ్య శ్రీ పరిధి పెంచుతామని… రైతు పండించిన పంట చివరి గింజ వరకు మద్దతు ధర ఇచ్చి కొంటామన్నారు. రైతులకు 2 లక్షల రుణ మాఫీ చేస్తామని… ఏడాది లోపు ప్రభుత్వ ఉద్యోగుల ఖాళీ భర్తీ చేస్తామన్నారు. గ్యాస్ సిలిండర్ 500 కె ఇస్తాం ..ఆడ బిడ్డలను ఆదుకుంటామని.. Rtc బస్సులో ఆడ బిడ్డలకు ఉచిత ప్రయాణం కల్పిస్తామన్నారు. దీనిపై త్వరలో ప్రకటిస్తామని చెప్పారు రేవంత్‌ రెడ్డి.

Read more RELATED
Recommended to you

Latest news