బ్రతికుండగానే చంపేసారు.. టీవీ నటుడు జాకీ..!

-

ప్రముఖ టీవీ నటుడు జాకీ గురించి బుల్లితెర సీరియల్స్ చూసేవారికి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఒకప్పుడు సీరియల్స్ లో హీరోగా నటించిన ఆయన ఇప్పుడు నటుడిగా రాణిస్తూ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఇక ఆయన భార్య నటి హరితను ప్రేమ వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. ఆమె కూడా సీరియల్స్ తో బిజీగా గడుపుతోంది. ఇదిలా ఉండగా ఇటీవల ఆయనకు సంబంధించిన ఒక వార్త నెట్టింట తెగ దుమారం రేపింది.. తాజాగా ప్రముఖ టీవీ నటుడు జాకీ ఆయన భార్య హరిత తో పాటు ప్రముఖ హీరో సాయికిరణ్, అర్చన అనంత్ లు సుమ అడ్డా అనే షో కి హాజరయ్యారు. ఇక ఆ షోలో తమదైన పంచులతో నవ్వులు పూయించారు.

తాజాగా విడుదలైన ప్రోమో యూట్యూబ్లో బాగా ట్రెండ్ అవుతుంది. ఇందులో చివర్లో ఒక షాకింగ్ విషయం నటుడు జాకీ బయట పెట్టడం గమనార్హం. అంత వరకు నవ్వులతో సాగిన ఈ షో ఒక్కసారిగా ఎమోషనల్ గా మారిపోయింది. ఊహించని విషయాన్ని ఆయన సుమా ముందు వెల్లడిస్తూ కన్నీటి పర్యంతమయ్యారు. ఆరేడు నెలల క్రితం తనకు సంబంధించిన ఒక వార్త హల్చల్ చేసిందని.. తాను బ్రతికుండగానే చనిపోయినట్టు వార్తలు వచ్చాయని చెబుతూ అందరిని ఆశ్చర్యానికి గురి చేశాడు జాకీ.

ఆయన మాట్లాడుతూ.. ఆరేడు నెలల క్రితం జాకీ ని కాలుస్తున్నారు.. జాకీ చనిపోయాడు అంటూ వార్తలు సృష్టించారు అని చెప్పగానే దీనికి ఆయన భార్య హరిత షో లోనే కన్నీటి పర్యంతం అయింది. మరొకవైపు సుమా కూడా ఈ విషయం చూసి ఆశ్చర్యపోయింది. అలాగే సాయికిరణ్ అర్చనలు కూడా నోరెళ్ళ పెట్టారు. సాఫీ గా సాగుతున్న జీవితంలో కఠోరమైన జీర్ణించుకోలేని విషయాలు జీవితాలను అతలాకుతలం చేస్తాయి అంటూ మరింతగా ఆయన బాధపడ్డారు. ఇప్పుడు ఈ ప్రోమో చాలా వైరల్ గా మారింది.

Read more RELATED
Recommended to you

Latest news