రాజ్ తరుణ్ కేసులో ట్విస్ట్..లావణ్యకు నోటీసులు జారీ ?

-

టాలీవుడ్‌ యంగ్‌ హీరో రాజ్ తరుణ్ లావణ్య కేసులో ట్విస్ట్ చోటు చేసుకుంది. నిన్న రాజ్ తరుణ్ పై నార్సింగ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు లావణ్య. ఈ తరుణంలోనే నిన్న సాయంత్రం లావణ్య కే నోటీసులు ఇచ్చారు నార్సింగ్ పోలీసులు. ఫిర్యాదుకు సంబంధించిన ఆధారాలు సమర్పించాలని లావణ్య కు నోటీసులు అందించారు పోలీసులు.

Twist in Raj Tarun’s Lavanya case

ఈ మేరకు 91 crpc కింద నోటీసులు జారీ ఇచ్చారు. తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేశాడని లావణ్య ఫిర్యాదు చేశారు. ఈ మేరకు ఆధారాలు సమర్పించాల్సిందిగా లావణ్యను కోరారు పోలీసులు. కానీ ఇప్పటి వరకు పోలీసులకు అందుబాటులోకి రాలేదు లావణ్య. దీంతో ఆమె పారిపోయినట్లు చెబుతున్నారు.

అటు రాజ్ తరుణ్ వ్యవహారంలో పోలీసులు తాజాగా స్పందించారు. రాజ్ తరుణ్ ప్రియురాలు లావణ్య తమకు ఫిర్యాదు చేసిందని నార్సింగ్ ఇన్ స్పెక్టర్ వెల్లడించారు. రాజ్ తరుణ్ మరో అమ్మాయితో సహజీవనం చేస్తున్నాడని, తనని బెదిరింపులకు దిగుతున్నారని ఫిర్యాదులో పేర్కొంది. తనని చంపేస్తామంటూ అమ్మాయి తో పాటు ఆమె సోదరుడు బెదిరింపులకు దిగుతున్నారు. చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొంది. లావణ్య ఇచ్చిన ఫిర్యాదు పైన ఆధారాలు పరిశీలించి చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.

Read more RELATED
Recommended to you

Latest news