SSMB28 : మహేష్‌ సినిమాలో ఇద్దరు తమిళ స్టార్లు !

-

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు ప్రజెంట్ ‘సర్కారు వారి పాట’ ఫిల్మ్ సక్సెస్ ను ఫారిన్ ట్రిప్ లో ఎంజాయ్ చేస్తున్నాడు. ఈ క్రమంలోనే మహేశ్ ..నెక్స్ట్ ఫిల్మ్ షూట్ విషయమై మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో మహేశ్ మూడో చిత్రం చేయనున్నాడు. ‘అతడు’, ‘ఖలేజా’ తర్వాత వీరిరువురి కాంబోలో వస్తున్న SSMB28పై భారీ అంచనాలే నెలకొని ఉన్నాయి.

ఈ చిత్రంలో మహేశ్ ద్విపాత్రాభినయం చేయనున్నాడని వార్తలు సోషల్ మీడియాలో వస్తన్నాయి. ఇందులో హీరోయిన్ గా త్రివిక్రమ్ ఆస్థాన నాయిక టాలీవుడ్ బుట్ట బొమ్మ పూజా హెగ్డే నటిస్తోంది. ఈ పిక్చర్ లో భారీ యాక్షన్ సీన్స్ ను త్రివిక్రమ్ ప్లాన్ చేస్తున్నారు. అయితే.. ఈ సినిమా నుంచి ఓ అప్డేట్‌ వచ్చింది.

ఈ సినిమాలో కన్నడ స్టార్‌ ఉపేంద్ర తో పాటు కోలీవుడ్‌ స్టార్‌ నటుడు విజయ్‌ సేతుపతి కూడా నటిస్తున్నారని టాక్‌ వినిపిస్తోంది. కాగా ఈ సినిమాలో నటుడు ఉపేంద్ర రోల్‌ చాలా కీలకమైందని, అలాగే విజయ్‌ సేతుపతి నెగిటివ్‌ పాత్ర చేస్తున్నారని ఓ బజ్‌ బయటకు వచ్చింది. దీనిపై అతి త్వరలోనే అధికారిక ప్రకటన రానుందట. కాగా.. ఈ సినిమా షూటింగ్‌ త్వరలోనే ప్రారంభం కానుండగా, వచ్చే ఏడాది సమ్మర్‌ కానుకగా రిలీజ్‌ కానుంది.

Read more RELATED
Recommended to you

Latest news