ఎట్టకేలకు సమంత ఆరోగ్యం పై స్పందించిన వెంకి కూతురు..!!

-

టాలీవుడ్లో ప్రముఖ హీరోయిన్ సమంత మయోసైటిస్ అనే ప్రాణంతకమైన వ్యాధితో బాధపడుతున్నట్లుగా నిన్నటి రోజున తన సోషల్ మీడియా ఖాతా నుంచి తెలియజేయడం జరిగింది. దీంతో ఒక్కసారిగా అభిమానులతో పాటు, సినీ ప్రముఖుల సైతం సమంతకు ధైర్యాన్నిస్తూ సోషల్ మీడియాలో తెలియజేస్తూ ఉన్నారు. ఇక చిరంజీవి కూడా సమంత ఆరోగ్యం పైన ట్వీట్ చేయడం జరిగింది. వీరితోపాటు ఎన్టీఆర్, అఖిల్ ,నాగబాబు, జాన్వీ కపూర్, సుస్మిత కొణిదెల ,కృతి సనన్, మంచు లక్ష్మి తదితర హీరోయిన్ల సైతం సమంతకు అండగా నిలవడం జరిగింది. అంతేకాకుండా సమంతని ధైర్యంగా ఉండమని త్వరగా కోలుకొని వస్తావని ఆకాంక్షిస్తూ లవ్ సింబల్స్ ను, హార్ట్ సింబల్స్ ను సమంత పోస్టులకు కామెంట్స్ పెడుతూ ఉన్నారు.

అయితే తాజాగా హీరో వెంకటేష్ కూతురు ఆశ్రిత దగ్గుబాటి సమంత ఆరోగ్యం పైన స్పందించడం జరిగింది. నీలో నీకు తెలియనంత గొప్ప శక్తి ఉంది.. నీకోసం అనంతమైన ప్రేమను పంపుతున్నాను అంటూ సోషల్ మీడియా వేదికగా ఒక పోస్ట్ చేయడం జరిగింది ఆశ్రిత. ఇక అంతే కాకుండా అక్కినేని కుటుంబం నుంచి అఖిల్, సుశాంత్ మాత్రమే సమంత ఆరోగ్యం పైన స్పందించడం జరిగింది. నాగచైతన్య, నాగార్జున, అమల మాత్రం ఇప్పటివరకు సమంత ఆరోగ్యం పైన స్పందించకపోవడంతో అటు అభిమానులలో అసహనం ఉన్నట్లుగా తెలియజేస్తున్నారు.

ఇక ప్రస్తుతం సమంత సినిమాల విషయానికి వస్తే యశోద, శాకుంతలం, ఖుషి వంటి సినిమాలలో నటించింది ఇందులో యశోద సినిమా త్వరలోనే విడుదలకు సిద్ధంగా ఉన్నది. ఇక ఖుషి సినిమాలో విజయ్ దేవరకొండ తో కలిసి నటిస్తూ ఉన్నది. ఈ సినిమా షూటింగ్ జరుగుతూ ఉన్న సమయంలోనే సమంత ఆరోగ్యం బాగా లేకపోవడంతో ఈ సినిమా షూటింగ్ ఆగిపోయింది. మరి సమంత ఆరోగ్యం పైన నాగచైతన్య స్పందిస్తారేమో చూడాలి.

Read more RELATED
Recommended to you

Exit mobile version