వకీలుగా కీర్తి సురేశ్..టొవినో థామస్‌తో ‘‘వాశి’’లో మాటల యుద్ధం

-

మహానటి కీర్తి సురేశ్..ప్రస్తుతం తన సినిమాల సక్సెస్ ను ఫుల్ ఎంజాయ్ చేస్తోంది. అమెజాన్ ప్రైమ్ ఓటీటీ వేదికగా విడుదలైన ‘‘సానికాయిధమ్’’..తెలుగులో ‘‘చిన్ని’’ చిత్రానికి ప్రేక్షకులతో పాటు విమర్శకుల నుంచి ప్రశంసలు అందాయి. ఇక సూపర్ స్టార్ మహేశ్ బాబు ‘‘సర్కారు వారి పాట’’లో కీర్తి క్యూట్ నెస్ తో చేసిన యాక్టింగ్ కు జనాలు ఫిదా అవుతున్నారు.

ఈ క్రమంలోనే కీర్తి సురేశ్ మరో అప్ డేట్ ఇచ్చేసింది. మలయాళం భాషలో కీర్తి సురేశ్ నటిస్తున్న ‘‘వాశి’’ ట్రైలర్ అప్ డేట్ ఇచ్చేసింది. తాజాగా విడుదలైన ట్రైలర్ లో ‘‘మహానటి’’ తన డైలాగ్స్ తో ‘‘కోర్ట్ రూమ్’’లో అదరగొడుతోంది. వకీలుగా కీర్తి సురేశ్ నయా లుక్ లో కనబడుతోంది.

మరో వైపున మలయాళం వెర్సటైల్ యాక్టర్ టొవినో థామస్..ఇందులో కీలక పాత్ర పోషించారు. కోర్ట్ రూమ్ డ్రామాలో కీర్తి సురేశ్, టొవినో థామస్ మధ్య ఫైట్ ఆసక్తికరంగా సాగనుందని ట్రైలర్ చూస్తుంటే స్పష్టమవుతోంది. విష్ణు జి.రాఘవ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఈ ఏడాది జూన్ 17న విడుదల కానుంది.

Read more RELATED
Recommended to you

Latest news