వివాహ బంధంతో ఒక్కటైన వరుణ్‌ తేజ్ – లావణ్య త్రిపాఠి.. ఫొటో వైరల్

-

టాలీవుడ్ మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్.. సొట్టబుగ్గల సుందరి లావణ్య త్రిపాఠి వివాహ బంధంతో ఒక్కటయ్యారు. ఇటలీలోని టస్కానీ వేదికగా డెస్టినేషన్ వెడ్డింగ్ లో ఈ జంట బుధవారం రాత్రి 7.18 గంటలకు మూడు ముళ్ల బంధంలో అడుగుపెట్టింది. ఇరు కుటుంబాల వారు, అత్యంత సన్నిహితుల మధ్య వరుణ్-లావణ్యల వివాహ వేడుక ఘనంగా జరిగింది. ఈ పెళ్లికి మెగా, అల్లు కుటుంబాలకు చెందిన హీరోలంతా షూటింగ్స్ లో బ్రేక్ తీసుకుని హాజరయ్యారు.

వరుణ్ లావణ్యల పెళ్లి ఫొటో ఒకటి ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. ఈ ఫొటోలో వరుణ్ వైట్ కలర్ శర్వాణీలో కనిపించగా.. లావణ్య రెడ్ కలర్ లెహంగాలో కనిపించింది. ఈ జంట దేవుడి ఆశీర్వాదం తీసుకుంటున్న ఫొటో ఇప్పుడు సోషల్ మీడియాలో సందడి చేస్తోంది. ఈ ఫొటో చూసిన అభిమానులు కొత్త జంటకు శుభాకాంక్షలు చెబుతున్నారు. ఆరేళ్ల ప్రేమ ఎట్టకేలకు పెళ్లి పీటలెక్కిందంటూ కామెంట్స్ చేస్తున్నారు. సినీ ఇండస్ట్రీ, ప్రముఖుల కోసం నవంబర్‌ 5న హైదరాబాద్‌లో రిసెప్షన్‌ నిర్వహించనున్నారు. మాదాపూర్‌ ఎన్‌-కన్వెన్షన్‌ వేదికగా ఈ కార్యక్రమం జరగనుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version