Venkatesh: ఆ సినిమాతో వాళ్లకి డబుల్ ట్రీట్ ఇస్తా: వెంక‌టేష్

-

Venkatesh: వెంక‌టేష్ .. కామెడీ, యాక్ష‌న్, రొమాంటిక్.. ఏ జాన‌ర్లోనైనా.. ఇట్టే ఒదిగిపోయే న‌టుడు. సినీయ‌ర్ న‌టుడు అయిన‌ప్ప‌టికీ.. కాలానికి అనుగుణంగా.. తన‌న్ని తాను మార్చుకుంటూ.. యంగ్ హీరోల‌కు పోటీగా నిలిస్తున్నాడు వెంక‌టేష్. మ‌రికొత్త త‌ర‌హాలో న‌టించ‌డం ఆయ‌న‌కు ఆయ‌నే సాటి.. మల్టీ స్టార‌ర్ మూవీలో నటించాల‌న్నా.. నార‌ప్ప లాంటి ప్ర‌యోగాత్మ‌క చిత్రాల‌తో న‌టించిన తొలి ఘ‌న‌త ఆయ‌కే ద‌క్కింది.

తాజాగా ఆయ‌న‌ సూపర్ హిట్ మూవీ అయినా.. దృశ్యం సీక్వెల్‏ దృశ్యం 2 చిత్రంలో న‌టిస్తున్నారు. ఆయ‌న స‌ర‌స‌న‌ మీనా న‌టిస్తుండగా.. నదియా, నరేష్, కృతిక, ఈస్తర్ అనిల్, సంపత్ రాజ్, పూర్ణ ప్ర‌ధాన పాత్రల‌తో క‌నిపించ‌నున్నారు. ఈ సినిమా నవంబర్ 25న ప్రముఖ ఓటీటీ అమెజాన్ ప్రైమ్‏లో స్ట్రీమింగ్ కానుంది. ఈ చిత్రానికి జీతూ జోసెఫ్ దర్శకత్వం వహించగా.. ఆంటోని పెరంబవూర్, రాజ్ కుమార్ సేతుపతి, సురేష్ బాబు కలిసి సురేష్ ప్రొడక్షన్స్, రాజ్ కుమార్ థియేటర్స్ అండ్ మ్యాక్స్ మూవీస్ బ్యానర్ల మీద సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ నేపథ్యంలో వెంక‌టేష్ మీడియాతో మాట్లాడుతూ.. ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.

“నా ఫ్యాన్ కు ఓపిక ఎక్కువ .. వాళ్లు నా గురించి అర్థం చేసుకుంటారు. సినిమాల పరంగా నేను తీసుకున్నా.. వాళ్లు స్వాగతిస్తారు. నా సినిమా మీద పెద్ద‌గా అంచ‌నాలు పెట్టుకోకుండా ఎందులో రిలీజ్ చేసినా.. ఆదరిస్తారు. నన్ను ప్రోత్సహిస్తారు. ఈ సారి ఓటీటీలో వ‌చ్చినా.. ‘ఎఫ్ 3’ సినిమా మాత్రం థియేటర్లలోనే వస్తుంది. ఆ సినిమాతో వాళ్లకి డబుల్ ట్రీట్ ఇస్తాను” అని చెప్పుకోచ్చారు. ఈ క్ర‌మంలో ‘దృశ్యం 3’ ఉండే అవకాశం ఉందా? అని ప్ర‌శ్నించగా.. “‘దృశ్యం 3’ ఉండొచ్చు ..అందుకు కొన్నేళ్లు ఆగాలి. నా గెడ్డం ఇంకా నెరిసిపోతుంది.. నా పిల్లలు ఇంకా పెద్దవాళ్లవుతారు” అంటూ త‌న‌దైన శైలిలో స‌మాధాన‌మిచ్చారు.

Read more RELATED
Recommended to you

Latest news