ఈ వస్తువులు ఇతరులకు ఇస్తున్నారా? తస్మాత్ జాగ్రత్త..!

-

మన జీవితంలో జరిగే ఎన్నో పరిణామలకు కారణం మన జాతకంలో కలిగే మార్పులు,మరియు మనము తెలియకుండా చేసే పనులు మాత్రమే అంటారు జ్యోతిష నిపుణులు.మన ఇంట్లో వచ్చే ఆర్థిక ఇబ్బందులకు ఒక విధంగా కారణం కొన్ని వస్తువులు మన చేతి నుండి ఇతరులకు ఇవ్వడం వల్ల వస్తాయి. అయితే ఆ వస్తువులెంటో ఇప్పుడు చూద్దాం.

అరచేతి నుంచి కొన్ని వస్తువులు దానంగా కానీ, అప్పుగా కానీ, బదులుగా కానీ ఇవ్వకూడదని జ్యోతిష్య శాస్త్రంలోనే పేర్కొన్నారు.

ఉప్పు :
ఎవరి చేతితో ఉప్పు ఇవ్వకూడదని, ఎవరి ఇంట్లో కూడా ఉప్పు అప్పుగా అడగకూడదని జ్యోతిష్య శాస్త్రంలో పేర్కొన్నారు.ఈ విధంగా చేయడం వల్ల ఇంట్లో పేదరికం వచ్చే అవకాశం ఉందనీ నమ్ముతారు.ఉప్పును మన అరచేతితో మరొకరికి ఇస్తే ఇంటి ఆర్థిక పరిస్థితి దెబ్బతింటుందని హెచ్చరిస్తారు.

పచ్చి మిరపకాయలు :
పచ్చి మిరపకాయలు కూడా వేరేవారికి మన చేతితో ఇవ్వకూడదు. ఒకవేళ కుడిచేతితో కారం ఇస్తే, తీసుకున్న వ్యక్తికి, మీకు మధ్య గొడవలు, మనస్పర్థలు వచ్చే అవకాశం ఉందని జ్యోతిష్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.

త్రాగునీరు :
సాధారణంగా దాహంగా వున్నవారికి నీరు ఇస్తే పుణ్యం వస్తుందంటారు. కానీ అలాంటి వ్యక్తికీ నీటిని మీ దోసిళ్లతో పోయకూడదు. ఇలా చేయడం వల్ల మనకు ఐశ్వర్యం దానం చేసినట్టు అవుతుంది. దీని వల్ల సంపద, పుణ్యం, సుఖ సంతోషాలు నశిస్తాయి.

రొట్టె :
మీరు ఎవరికైనా రొట్టె ఇవ్వవలసి వస్తే , దాన్ని ప్లేట్‌లో పెట్టి ఇవ్వాలి. ఏ వ్యక్తికైనా చేతిలోకి రొట్టెలు ఇవ్వడం వల్ల ఇంటి సంపదలు వారికి ఇచ్చినట్టే అవుతుంది.

రుమాలు :
జ్యోతిష్య శాస్త్రంలో ఎవరికీ రుమాలు దానంగా కానీ, గిప్ట్ గా కానీ ఇవ్వకూడదని పేర్కొన్నారు. ఎవరికైనా గిఫ్ట్ గా రుమాలు ఇవ్వడం వల్ల వారిద్దరి మధ్య మనస్పర్థలు వచ్చి స్నేహం దెబ్బతింటుందనీ హెచ్చరిస్తున్నారు.

పైన చెప్పిన వస్తువులన్నీ ఒక వేల ఇవ్వవలసి వస్తే మీ చేతితో కాకుండా ప్రక్కన పెట్టి తీసుకోమనడం ఉత్తమం.

Read more RELATED
Recommended to you

Latest news