కరీంనగర్ : వృద్ధురాలిపై గొడ్డలితో దాడి

-

ఎల్కతుర్తి మండలం దామెర గ్రామానికి చెందిన అలకుంట అయిలమ్మపై మంత్రాల నెపంతో ఇదే గ్రామానికి చెందిన నలుగురు గొడ్డలితో దాడికి పాల్పడినట్లు SI పరమేశ్ తెలిపారు. ఈ నెల 7న అయిలమ్మ ఇంటికి వెళ్లిన చిన్న ఎల్లయ్య అతడి భార్య భాగ్య, కుమారులు ప్రవీణ్, రమేష్ దాడి చేశారు. అయిలమ్మ కుమారుడు అనిల్ అడ్డు రావడంతో అతన్ని తీవ్రంగా కొట్టారు. బుధవారం బాధితురాలి ఫిర్యాదు మేరకు నలుగురిపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news