కరీంనగర్ : జ్వర సర్వేలో 42,478 ఇళ్ల సందర్శన

-

కరీంనగర్: వైద్య ఆరోగ్యశాఖ, ఇతర శాఖల సమన్వయంతో శనివారం 710 టీమ్స్ 42,478 ఇళ్లు సందర్శించి, 1,119 మందిలో రోగ లక్షణాలను గుర్తించి వారికి హోమ్ ఐసోలేషన్ కిట్ ఇవ్వడం జరిగిందని జిల్లా వైద్యాధికారి డా.జువైరియా అన్నారు. అలాగే 1,247 మందికి కరోనా పరీక్షలు చేయగా, 104 పాజిటివ్ కేసులను గుర్తించారు. ఇప్పటివరకు 269 మంది హోమ్ ఐసోలేషన్‌లో ఉన్నారన్నారు. జిల్లాలో ఒక్క కేసు కూడా ఆస్పత్రిలో అడ్మిట్ జరగలేదని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news