Karimnagar: ‘అవయవ దానంతో పునర్జన్మ ఎత్తాడు’

-

అవయవదానం చేసి పునర్జన్మ ఎత్తాడు ఓ యువకుడు. కరీంనగర్ జిల్లా రామడుగు మండలం రంగశాయిపల్లికి చెందిన యువకుడు గంగసాని శ్రీనివాస్ రెడ్డి(26) ఈ నెల 6న స్వగ్రామంలో బైక్‌పై నుంచి పడి తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే అతణ్ని సికింద్రాబాద్‌లోని యశోద ఆసుపత్రిలో చేర్చారు. తలకు బలమైన గాయం కావడంతో బ్రెయిన్ డెడ్‌గా వైద్యులు తెలిపారు. తీవ్ర విషాదంలోనూ ఆ తల్లిదండ్రులు అవయవదానానికి అంగీకరించి గొప్ప మనసు చాటుకున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news