ప్రధాన రహదారిలో గ్యాస్ లీకేజీ

-

నిజాంపేట్ ప్రధాన రహదారిలో గ్యాస్ లీకేజీతో స్థానికులు భయాందోళన చెందారు. గాయత్రీ టవర్ సమీపంలో జేసీబీతో నీటి పైపులైను మరమ్మతు పనులు చేస్తుండగా.. పక్కనే ఉన్న గ్యాస్ పైప్ పగిలిపోయింది.

దీంతో గ్యాస్ లీకవడంతో ఒక్కసారిగా గాళ్లోకి దుమ్ము, ధూళి ఎగిసిపడటంతో స్థానికులు ఇబ్బందులు పడ్డారు. కాసేపు అక్కడ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. అప్రమత్తమైన అధికారులు గ్యాస్ లీక్ కాకుండా చర్యలు తీసుకున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news