మెదక్ : ప్రమాదకరంగా మారిన ప్రజ్ఞాపూర్ చౌరస్తా..!

-

రాజీవ్ రహదారిపై గల ప్రజ్ఞాపూర్‌ నిత్యం వేల సంఖ్యలో వెళ్ళే వాహనాలతో రద్దీగా ఉంటుంది. ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గం, మంత్రి హరీష్ రావు నిత్యం వెళ్ళే మార్గం ఇది. కానీ, ఇక్కడ ఒక్క ఫ్లైఓవర్ లేని కారణంగా చాలా ప్రమాదాలు జరుగుతున్నాయి, ఫ్లైఓవర్ నిర్మించాలని ప్రజలు అధికారులను కోరినా ఇంతవరకు అది కార్యరూపం దాల్చలేదని చెబుతున్నారు. ఇప్పటికైనా అధికారులు ఫ్లైఓవర్ నిర్మాణానికి చొరవ చూపాలంటున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news