బిగ్ బి ఫ్యామిలీ మొత్తానికి కరోనా పాజిటివ్…!

-

బాలీవుడ్ బిగ్ బీ అమితాబ్ ఫ్యామిలీ మొత్తానికి కరోనా సోకింది. వారిని కరోనా నీడలా వెంటాడుతుంది. నిన్న అమితాబ్ కు అలాగే ఆయన కుమారుడు, హీరో ఆభిషేక్ కు కరోనా పాజిటివ్ రాగా వారిని ముంబై లోని నానావతీ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఇక కుటుంబ సభ్యులు అందరికి కరోనా పరిక్షలు చేయగా అందరికి కరోనా ఉందని వెల్లడి అయింది.

తాజాగా మాజీ మిస్ వరల్డ్ బాలీవుడ్ ప్రముఖ హీరోయిన్ ఐశ్వర్య రాయ్ కు, ఆమె కుమార్తె ఆరాధ్యకు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయిందని అధికార వర్గాలు వెల్లడించాయి. ఇక వారి ఇల్లు జల్సాను కంటైన్మేంట్ జోన్ గా అధికారులు ప్రకటించిన సంగతి తెలిసిందే. వారి ఇంటిని బృహన్ ముంబై కార్పోరేషన్ అధికారులు ఇప్పటికే పూర్తి స్థాయిలో శానిటేషన్ చేసారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version