క‌రోనా వ‌ల్ల 11మంది భార‌తీయ అమెరిక‌న్ల మృతి – 16మంది పాజిటివ్‌

-

వాషింగ్ట‌న్ – క‌నీసం 11మంది భారతీయులు కొవిడ్‌-19 బారిన ప‌డి మృతి చెందార‌ని, ఇంకా 16మందికి క‌రోనా పాజిటివ్‌గా తేలింద‌ని అమెరికా అధికార‌వ‌ర్గాలు తెలిపాయి. 4 ల‌క్ష‌ల‌కు పైగా పాజిటివ్ కేసుల‌తో, 4వేల‌కు పైగా మృతుల‌తో అమెరికా అల్లాడుతోంది.

చ‌నిపోయిన 11మందీ మ‌గ‌వారేన‌ని, అంద‌రూ న్యూయార్క్‌, న్యూజెర్సీకి చెందిన‌వార‌ని తెలుస్తోంది. న‌లుగురు న్యూయార్క్ న‌గ‌రంలో టాక్సీ డ్ర‌యివ‌ర్లుగా ప‌నిచేస్తున్నారు. ప్ర‌స్తుతం న్యూయార్క్ న‌గ‌రం ఈ మ‌హ‌మ్మారికి కేంద్రంగా మారింది. ఇక్క‌డే 1,50,000ల‌కు పైగా కేసులుండ‌గా, 6000 మంది కంటే ఎక్కువ‌గా మృతి చెందారు. తర్వాతి స్థానం న్యూజెర్సీది. ఇక్క‌డ 47వేల కేసులుండ‌గా, 1500 మంది మ‌ర‌ణించారు.

ఇక పాజిటివ్ వ‌చ్చిన 16 మందిలో న‌లుగురు మ‌హిళ‌లు కాగా, అంద‌రూ హోమ్ క్వారెంటైన్‌లో ఉన్న‌ట్లు తెలిసింది. ఇందులో 8మంది న్యూయార్క్‌, ముగ్గురు న్యూజెర్సీ, మిగిలిన‌వారు ఇత‌ర రాష్ట్రాల‌కు చెందిన‌వారు. ఇండియాలో వీరంద‌రు ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌, ఉత్త‌రాఖండ్‌, క‌ర్ణాట‌క‌, మ‌హారాష్ట్రల నుండి అమెరికాకు వెళ్లిన‌వారుగా తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news