ఇండియా కరోనా అప్డేట్.. మళ్ళీ భారీగానే !

-

భారత్ లో కరోనా విజృంభిస్తూనే ఉంది. మొదట్లో ప్రభుత్వాలు అన్నీ లాక్ డౌన్ లో ఉండడంతో కరోనా కేసులు కంట్రోల్ లోనే ఉండేవి. కానీ ఆర్ధిక పరిస్థితుల దృష్ట్యా అన్నీ వదిలేయడంతో రోజుకు లక్షకు చేరువలో కరోనా కేసులు నమోదవుతున్నాయి. ఇప్పటికే కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 53 లక్షల 08 వేలు దాటింది. గడచిన 24 గంటలలో అత్యధికంగా రికార్డ్ స్థాయిలో 93,337 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. గడచిన 24 గంటలలో దేశంలో కరోనా వల్ల మొత్తం 1,247 మంది మృతి చెందారు.

Coronavirus on scientific background

అలానే గడచిన 24 గంటలలో దేశ వ్యాప్తంగా డిశ్ఛార్జ్ అయిన వారి సంఖ్య 95,880 గా ఉంది. దీంతో దేశంలో ఇప్పటివరకు నమోదయిన “కరోనా” పాజిటివ్ కేసుల సంఖ్య 53,08,015కు చేరగా ఇప్పుడు దేశ వ్యాప్తంగా 10,13,964 యాక్టీవ్ కేసులు ఉన్నాయి. కరోనాకు చికిత్స పొంది డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 42,08,432కు చేరింది. అలానే కరోనా వల్ల దేశంలో మొత్తం మృతి చెందిన వారి సంఖ్య 85,619కు చేరింది. దేశంలో కరోనా రోగుల రికవరీ రేటు 78.86 శాతానికి చేరింది. దేశంలో నమోదయిన మొత్తం కేసులలో యాక్టివ్ కేసులు 19.52 శాతంగా ఉన్నాయి. దేశంలో మొత్తం నమోదయిన కేసులలో మరణాల రేటు 1.62 శాతానికి తగ్గింది.

Read more RELATED
Recommended to you

Latest news