ఇండియా కరోనా అప్డేట్.. ఈరోజు ఎన్నంతే ?

-

భారత్ లో కరోనా కేసులు విజృంభిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా నమోదయిన కేసులతో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 60 లక్షల 74 వేలు దాటింది. ఇక కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ విడుదల చేసిన తాజా బులెటిన్ ప్రకారం గడచిన 24 గంటలలో 82,170 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో దేశంలో ఇప్పటివరకు నమోదయిన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 60,74,703 కు చేరింది. అలానే గడచిన 24 గంటలలో దేశంలో కరోనా వల్ల మొత్తం 1039 మంది మృతి చెందారు. దీంతో కరోనా వల్ల దేశంలో మొత్తం మృతి చెందిన వారి సంఖ్య 95, 542కు చేరింది.

NEW DELHI, INDIA – MARCH 31: A bus driver in a protective suit before ferrying people who took part in a Tablighi Jamaat function earlier this month to a quarantine facility amid concerns of infection, on day 7 of the 21 day nationwide lockdown imposed by PM Narendra Modi to check the spread of coronavirus, at Nizamuddin West on March 31, 2020 in New Delhi, India. (Photo by Ajay Aggarwal/Hindustan Times via Getty Images)

గడచిన 24 గంటలలో దేశ వ్యాప్తంగా డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 74,893 కాగా కరోనాకు చికిత్స పొంది డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 50,16,520కు చేరింది. ఇక దేశ వ్యాప్తంగా 9,62,640 యాక్టీవ్ కేసులు ఉండగా దేశంలో 82.58 శాతం కరోన రోగుల రికవరీ రేటు ఉంది. దేశంలో నమోదయిన మొత్తం కేసులలో యాక్టివ్ కేసులు 15.85 శాతంగా ఉండగా మొత్తం నమోదయిన కేసులలో మరణాల రేటు 1.57 శాతానికి తగ్గింది. దేశ వ్యాప్తంగా గడచిన 24 గంటలలో 7,09,394 కరోనా వైరస్ నిర్దారణ పరీక్షలు చేయగా ఇప్పటి దాకా దేశంలో 7,19,67,230 కరోనా వైరస్ నిర్దారణ పరీక్షలు చేశారు.

 

Read more RELATED
Recommended to you

Latest news