తెలంగాణా కరోన.. 2534 కేసులు, 11 మరణాలు !

-

తెలంగాణలో కరోనా కేసులు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. తాజాగా ప్రభుత్వ వైద్యారోగ్య శాఖ విడుదల చేసిన కరోనా బులెటిన్ ప్రకారం గడచిన 24 గంటల్లో 2534 కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో నమోదయిన మొత్తం కేసుల సంఖ్య 1,50,176కి చేరింది. ఇక నిన్న ఒక్క రోజే రాష్ట్రంలో 11 మంది కరోనా వలన చనిపోయారు. దీంతో ఇప్పటిదాకా కరోనా సోకి మరణించిన వారి సంఖ్య 927కు చేరింది.

coronavirus
coronavirus

ఇప్పటిదాకా కరోనా నుండి 1,17,143 మంది కోలుకోగా నిన్న ఒక్కరోజే 2,071 మంది కరోనా బారి నుండి కోలుకున్నారు. ఇక రాష్ట్రంలో 32,106 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి. అందులో 25,066 మంది హాస్పిటల్స్ లో కాకుండా హోం ఐసోలేషన్ లోనే ఉన్నారు. ఇక నిన్న ఒక్కరోజే 63,017 శాంపిల్స్ టెస్ట్ చేయగా ఇప్పటిదాకా టెస్ట్ చేసిన శాంపిల్స్ సంఖ్య 19,53,571కి చేరింది. ఎప్పటిలానే జీహెచ్ఎంసీలో భారీగా కేసులు నమోదయ్యాయి. ఒక్క రోజే ఇక్కడ 327 కేసులు నమోదు కాగా ఆ తరువాతి స్థానంలో రంగారెడ్డి జిల్లా 195 కేసులతో నిలిచింది.

Read more RELATED
Recommended to you

Latest news