ఫ్యాక్ట్ చెక్: ఏటీఎంల నుంచి డబ్బులను డ్రా చేస్తే మనీ కట్ అవుతున్నాయా?

-

ఏటీఎంల నుంచి డబ్బులను డ్రా చేస్తే మనీ కట్ అవుతూన్నాయనే వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.ఆర్బీఐ గానీ, కేంద్రం గానీ దేశంలో బ్యాంకింగ్ సౌకర్యాలలో మార్పులు చేస్తూనే ఉంటాయి. ఇందులో వివిధ సేవా ఛార్జీలు మొదలైనవి కూడా ఉన్నాయి. సాధారణ ఏటీఎం నుంచి ఐదు సార్ల కంటే ఎక్కువ డబ్బులు డ్రా చేసినట్లయితే అందుకు ఛార్జీ విధిస్తుంటాయి బ్యాంకులు. అయితే కొన్నికొన్ని ఫేక్‌ న్యూస్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంటాయి.

అవి చూసిన చాలా మంది నమ్మి ఆందోళనకు గురవుతుంటారు. అలాంటిది వార్త సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. అలాంటి వైరల్‌ అయ్యే పోస్టులపై ప్రెస్‌ ఇన్ఫర్మేషన్‌ బ్యూరో ఫాక్ట్‌చెక్‌ పరిశీలించి క్లెయిమ్‌ చేస్తుంటుంది..ఈ మెసేజ్ ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కోడుతుంది.ATMల నుండి 4 విత్‌డ్రాల్స్ తర్వాత వినియోగదారులు ప్రతి లావాదేవీకి మొత్తం రూ. 173 చెల్లించాలి అనేది ఈ వైరల్‌ అవుతున్న పోస్టు సారాంశం. ఇలాంటి మెసేజ్‌ను మీరు కూడా చూసినట్లయితే ముందుగా ఇది నిజమా కాదా అనే విషయాన్ని తెలుసుకోవడం మంచిది..

సోషల్ మీడియాలో వైరల్‌ అవుతున్న సందేశంపై ప్రెస్‌ ఇన్ఫర్మేషన్‌ బ్యూరో క్లారిటీ ఇచ్చింది. ఏ కస్టమర్‌ అయినా ATM నుండి 4 సార్లు కంటే ఎక్కువ డబ్బు విత్‌డ్రా చేస్తే వారి ఖాతా నుండి 173 రూపాయలు కట్‌ అవుతాయన్నది పూర్తిగా నిజం కాదని ట్విట్టర్‌ ద్వారా తేల్చి చెప్పింది. సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్న ఇలాంటి పోస్టులు నకిలీవదని ఫ్యాక్ట్‌ చెక్‌ స్పష్టం చేసింది. మీ బ్యాంక్ ATM నుండి ప్రతి నెలా 5 ఉచిత లావాదేవీలు చేయవచ్చు. ఒక్కో లావాదేవీకి గరిష్టంగా రూ.21 మాత్రమే చెల్లించాల్సి ఉంటుందని వెల్లడించింది..

లావాదేవీలపై ఎటువంటి రుసుము చెల్లించాల్సిన అవసరం లేదు.తర్వాత డబ్బును ఉపసంహరించుకున్న తర్వాత మీరు 21 రూపాయలు, జీఎస్టీ ఛార్జీని చెల్లించాలి. అయితే, బ్యాలెన్స్‌ని తనిఖీ చేయడం నుండి మినీ స్టేట్‌మెంట్ లేదా పిన్‌ని మార్చడం వరకు అన్ని ఆర్థికేతర లావాదేవీలు ఉచితం.నాన్-మెట్రో నగరాల్లో, వినియోగదారులు 5 ATM లావాదేవీలను ఉచితంగా పొందవచ్చు.రూ. 21, ఆర్థికేతర లావాదేవీగా రూ. 8.50 చెల్లించాలి..ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది..

Read more RELATED
Recommended to you

Exit mobile version