తిరుమల హుండీ ఆదాయం ఒక్కరోజుకి రూ. 5.16 కోట్లు…

-

తిరుపతి జిల్లా తిరుమలలో వెలసియున్న కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడానికి ప్రపంచంలోని అన్ని చోట్ల నుండి భక్తులు కోకొల్లలుగా వస్తూ ఉంటారు. సీజన్ తో సంబంధం లేకుండా భక్తులు పోటెత్తి దర్శనం చేసుకుంటూ ఉంటారు. ఎప్పుడూ తిరుమలలో కిటకిటలాడే జనంతో బాలాజీని బిజీగా ఉంచుతారు. ఇక తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం కూడా తిరుమలలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. మాములుగా టికెట్ లు ఉండేవారికి త్వరగానే దర్శనం అయినా, ఎటువంటి టోకెన్లు లేని వారు మాత్రం దర్శనం పూర్తి చేసుకోవడానికి 20 గంటల సమయం పడుతోందట.

అయితే ఇప్పుడు మొత్తం 5 కంపార్ట్మెంట్ లలో భక్తులు వేచియున్నారు. కాగా నిన్న ఒకరోజు వెంకటేశ్వర స్వామిని మొత్తం 69781 మంది భక్తులు దర్శించుకున్నారు. ఇందులో మంది 27552 భక్తులు తలనీలాలు ఇచ్చుకున్నారు. అలా నిన్న ఒక్క రోజుకే శ్రీవారి హుండీకి రూ. 5.16 కోట్ల భారీ ఆదాయం వచ్చిందట.

Read more RELATED
Recommended to you

Exit mobile version